News February 7, 2025
ట్రైన్లో ప్రసవం.. పండంటి ఆడబిడ్డ జననం!

బిహార్లోని సమస్తిపూర్కు చెందిన ఓ గర్భిణి సహర్సాకు వెళ్తుండగా రైలులోనే పురిటి నొప్పులొచ్చాయి. దీంతో కోచ్లోని ఇతర మహిళలతో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ప్రసవానికి సహాయం చేశారు. దీంతో సదరు మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో ట్రైన్ను నిలిపేసి ఆమెను ఆస్పత్రికి తరలించగా తల్లీబిడ్డా ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 27, 2026
ప్రతి చిన్న విషయానికి సారీ అక్కర్లేదు: సమంత

ఒకే పరిస్థితి ఎదురైనప్పుడు మగాళ్లతో పోలిస్తే మహిళలు 10రెట్లు ఎక్కువగా సారీ చెబుతున్నారని నటి సమంత అన్నారు. ప్రతి చిన్న విషయానికి సారీ చెప్పాల్సిన అవసరం లేదని, తమను తాము తగ్గించుకోవడం ఆపాలని కోరారు. ఇక మూవీ ఇండస్ట్రీలో లేడీ యాక్టర్లు గుర్తింపునకు రెట్టింపు కష్టపడాల్సి వస్తోందని చెప్పారు. లేడీ ఓరియంటెడ్ మూవీలను రిస్క్లాగా చూడటం ఆపాలని ముంబైలో జరిగిన ఉమెన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో తెలిపారు.
News March 27, 2026
బ్లడ్బాత్.. ₹9 లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలు చవిచూశాయి. నిఫ్టీ 487 పాయింట్లు కోల్పోయి 22,819 వద్ద, సెన్సెక్స్ 1,690 పాయింట్ల నష్టంతో 73,583 వద్ద ముగిశాయి. దీంతో ఒక్కరోజే ₹9 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. టాటా మోటార్స్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోగా, ONGC, TCS, విప్రో, ఎయిర్టెల్, కోల్ ఇండియా షేర్లు లాభపడ్డాయి. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే ఆల్ టైమ్ కనిష్ఠానికి(94.82) పడిపోయింది.
News March 27, 2026
బ్లడ్బాత్.. ₹9 లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలు చవిచూశాయి. నిఫ్టీ 487 పాయింట్లు కోల్పోయి 22,819 వద్ద, సెన్సెక్స్ 1,690 పాయింట్ల నష్టంతో 73,583 వద్ద ముగిశాయి. దీంతో ఒక్కరోజే ₹9 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. టాటా మోటార్స్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోగా, ONGC, TCS, విప్రో, ఎయిర్టెల్, కోల్ ఇండియా షేర్లు లాభపడ్డాయి. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే ఆల్ టైమ్ కనిష్ఠానికి(94.82) పడిపోయింది.


