News February 7, 2025

కాళేశ్వరంలో తాత్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు

image

కాళేశ్వరంలో ఈనెల 7 నుంచి 9 వరకు మహా కుంభాభిషేకం మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగు నీటి ఏర్పాటు, తాత్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటుగా అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.

Similar News

News January 16, 2026

HYD: రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఇంటికే!

image

నూతన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఇకపై RTA కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. కొత్త సాఫ్ట్‌వేర్ అమలుకు HYD యంత్రాంగం కసరత్తు చేస్తోందని ఓ అధికారి తెలిపారు. వాహనదారుడు షోరూమ్‌లోనే డీలర్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చన్నారు. అనంతరం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ డైరెక్ట్‌గా పోస్టు ద్వారా ఇంటికే చేరుతుందని పేర్కొన్నారు. ఇది ప్రజలకు సమయం, శ్రమ ఆదా చేసే విధానమని తెలిపారు.

News January 16, 2026

KMR: ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావాహులు

image

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో రానున్న మున్సిపల్ ఎలక్షన్స్ లో పోటీ చేయబోయే ఆశావాహులు ఇటు ఓటర్లను, అటు అదిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కొందరు ప్రజల దాహార్తి తీర్చేందుకు కమ్యూనిట్ బోర్లు బాగు చేయిస్తే, పండగ నేపథ్యంలో స్వీట్లు, మాంసాహారం పంచుతున్నారు. మరికొందరు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. దీంతో మున్సిపల్‌లో రాజకీయం వేడెక్కింది.

News January 16, 2026

కనుమ రోజున పశువులను ఎలా పూజించాలి?

image

పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటేనే రైతుకి ఉత్సాహం. పంట చేతికి రావడంలో వాటి పాత్ర కీలకం. తమకు సుఖ,సంతోషాలను అందించడానికి అహర్నిశలు కష్టపడే పశువులను రైతులు మరచిపోరు. తమకు జీవనాధారమైన మూగజీవాల పట్ల కృతజ్ఞతగా అన్నదాతలు ‘కనుమ’ రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు. ఈ రోజు పశువులను ఎలా పూజిస్తే వ్యవసాయం మరింత సుభిక్షంగా ఉంటుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ <<>>క్లిక్ చేయండి.