News February 7, 2025

రేపు కోదాడలో నవోదయ ప్రవేశ పరీక్ష..

image

నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల మిగులు సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షను శనివారం పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, సెయింట్ జోసెఫ్ సీసీ రెడ్డి పాఠశాలల్లో నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి సలీం షరీఫ్ తెలిపారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు జరుగుతుందని చెప్పారు. విద్యార్థులు 10 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

Similar News

News February 8, 2025

రెబ్బెన: గంగాపూర్ జాతర ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్

image

రెబ్బెన మండలం గంగాపూర్‌లో ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న శ్రీబాలాజీ వెంకటేశ్వర స్వామి జాతరను అధికారులు సమన్వయంతో కృషిచేసి విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం జాతర ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. జాతర వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహనాల పార్కింగ్, భారీ కేడ్లు, తాగునీరు, తాత్కాలిక మూత్రశాలలు, మరుగుదొడ్లు సౌకర్యాలు కల్పించాలన్నారు. 

News February 8, 2025

సంగారెడ్డి: 9న ఎన్నికల విధులపై అధికారులకు శిక్షణ: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు ఈ నెల 9న జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో ఎన్నికల విధులపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి శుక్రవారం తెలిపారు. ఈ శిక్షణకు విధులు కేటాయించిన అధికారులందరూ హాజరు కావాలని సూచించారు.

News February 8, 2025

బెల్లంపల్లి: చోరీకి పాల్పడిన అనుమానితుని ఫోటో విడుదల

image

బెల్లంపల్లి పట్టణంలో బ్యాంకు డబ్బులు విత్ డ్రా చేసుకొని వెళుతున్న బట్వాన్‌పల్లి చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి నుంచి నగదు చోరీ చేసిన నిందితుల అనుమానిత ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. వన్ టౌన్ SHO దేవయ్య మాట్లాడుతూ.. చోరీ ఘటనపై కేసు నమోదుచేసి విచారణ కొనసాగిస్తున్నామన్నారు. నిందితుడిని గుర్తించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ కోరారు. 

error: Content is protected !!