News February 7, 2025
సంగారెడ్డి: డబుల్ డెక్కర్ రైలును చూశారా..!

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో డబుల్ డెక్కర్ రైలు నిలిచింది. చిత్తూరు నుంచి బయలుదేరిన ఈ డబుల్ డెక్కర్ రైలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణానికి వెళుతుండగా జహీరాబాద్ రైల్వే స్టేషన్లో ఆగింది. దాంతో ఇక్కడి ప్రాంత ప్రజలు అరుదైన డబుల్ డెక్కర్ రైలును ఆసక్తిగా తిలకించారు. స్టేషన్లోని ప్యాసింజర్లు ప్లాట్ ఫామ్ వద్ద డబుల్ డెక్కర్ రైలుతో సెల్ఫీ ఫోటోలు దిగి సందడి చేశారు.
Similar News
News March 24, 2026
అల్లూరి: ‘వచ్చే నెల 3 నుంచి స్పెషల్ ఆఫీసర్స్ పాలన’

ఉమ్మడి అల్లూరి జిల్లాలో ఏప్రిల్ 3 నుంచి పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్స్ పాలనలోకి వెళ్తాయని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ రావు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం ఉన్న సర్పంచ్లు, వార్డ్ మెంబర్స్ పదవీకాలం ఏప్రిల్ 2తో ముగుస్తుందని వెల్లడించారు. అల్లూరి జిల్లాలో 244, పోలవరం జిల్లాలో 186 పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్స్ను త్వరలో నియమించడం జరుగుతుందన్నారు. మండల స్థాయి అధికారులను నియమించాలని ఆదేశాలు అందాయన్నారు.
News March 24, 2026
HYDలో ఇంధనం, LPG సిలిండర్ల కొరత లేదు: CP

TG: హైదరాబాద్లో ఇంధనం, LPG సిలిండర్ల కొరత లేదని సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళనతో బంకులు, ఏజెన్సీల వద్ద క్యూ కట్టి రద్దీ పెంచవద్దని కోరారు. పరిస్థితిని పోలీసులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, వదంతులను నమ్మవద్దని ఆయన ‘X’ వేదికగా విజ్ఞప్తి చేశారు. అందరూ ప్రశాంతంగా ఉండి సహకరించాలని ఆయన సూచించారు.
News March 24, 2026
వనపర్తిలో ఎండల తీవ్రత!

వనపర్తి జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గడిచిన 24 గంటల్లో వెలుగొండలో అత్యధికంగా 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వీపనగండ్ల, దగడలో 38.6 డిగ్రీలుగా రికార్డయ్యాయి. జిల్లాలోని 21 కేంద్రాల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.


