News February 7, 2025
మేడిపల్లిలో హై వోల్టేజ్ రీసెర్చ్ ల్యాబోరేటరీ..!

మేడిపల్లి పరిధిలోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో హై వోల్టేజ్ రీసెర్చ్ ల్యాబోరేటరీ ఉన్నట్లుగా సైంటిస్టులు తెలిపారు. ఇందులో కేంద్ర వ్యాప్తంగా ఉన్న నిష్ణాతులైన ఎలక్ట్రికల్ ఇంజినీర్లు ఇందులో వివిధ రకాల పరిశోధనలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక అవుట్డోర్ డీసీ టెస్టింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి.
Similar News
News November 8, 2025
VKB: రైతులు దళారుల బారిన పడొద్దు: అదనపు కలెక్టర్

రైతులు పండించిన పంటలను దళారులకు అమ్మి మోసపోవద్దని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. తాండూర్లో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడుతూ.. వరి ధాన్యానికి ఏ గ్రేడ్కు రూ.2389, సన్న రకాలకు రూ.2369తో పాటు బోనస్గా రూ.500 చెల్లిస్తామని, సాధారణ రకాలకు రూ.2369 మద్దతు ధర ఇవ్వనున్నట్లు తెలిపారు. మొక్కజొన్నకు కూడా రూ.2400 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
News November 8, 2025
పెట్టుబడుల సదస్సుకు భారీ ఏర్పాట్లు

AP: విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే పెట్టుబడుల సదస్సు కోసం శరవేగంగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. AU ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండులో 8 హాళ్లను సిద్ధం చేస్తున్నారు. సమ్మిట్ ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరుకానున్నారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో పాటు 33 దేశాల వాణిజ్య మంత్రులు పాల్గొంటారు. ప్రాంగణంలో 1,600 మంది ప్రముఖులు కూర్చునేలా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.
News November 8, 2025
VKB: ముత్యాల పందిరి వాహనంపై ఊరేగింపు

అనంత పద్మనాభ స్వామి కార్తీక మాస పెద్ద జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అనంత పద్మనాభ స్వామిని ముత్యాల పందిరి వాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించి పల్లకీ సేవలో పాల్గొన్నారు.


