News February 7, 2025
నల్గొండ: 13 మంది 16 సెట్ల నామినేషన్లు..

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లను దాఖలు చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించినట్లు పేర్కొన్నారు.
Similar News
News March 24, 2026
రాజీ మార్గంలో వివాదాల పరిష్కారం: మంచిర్యాల సీపీ

ఈనెల 28న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీపీ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. లోక్ అదాలత్ ద్వారా వివాదాలు శాంతియుతంగా, రాజీమార్గంలో పరిష్కారం అవుతాయని తెలిపారు. చిన్నచిన్న తగాదాల కారణంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బువృథా చేయవద్దన్నారు. రాజీకి అనువైన క్రిమినల్ కాంపౌండ్డబుల్ కేసులు,సివిల్,ఆస్తి విభజన, కుటుంబపరమైన కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు.
News March 24, 2026
ప్లాట్ఫామ్ ఫీజు పెంచేసిన స్విగ్గీ.. నెటిజన్ల అసహనం!

ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ ప్లాట్ఫామ్ ఫీజులు పెంచడంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత వారం జొమాటో ₹13.50గా ఉన్న ఫీజును ₹14,90 చేసింది. తాజాగా స్విగ్గీ ₹14.99 నుంచి ₹17.58కి పెంచింది. చమురు ధరలు పెరగడం, ఇంధన కొరతే పెంపునకు కారణంగా తెలుస్తుండగా దీనిపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్ల జేబులకు చిల్లులు పెట్టేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయని అంటున్నారు.
News March 24, 2026
క్యాబినెట్ ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

TG: రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 2 స్థానాల భర్తీకి కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కేరళం అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక క్యాబినెట్ విస్తరణ చేసుకోవచ్చని CM రేవంత్కు సూచించినట్లు తెలుస్తోంది. మంత్రి పదవులకోసం ఇప్పటికే పలువురు నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. అధిష్ఠానం, CMను కలిసి విన్నవిస్తున్నారు. రాజగోపాల్, ప్రేమ్ సాగర్, మల్రెడ్డి రంగారెడ్డి వంటివారు ఈ రేసులో ఉన్నారు.


