News February 8, 2025
TODAY HEADLINES
* రాష్ట్రంలో BCల జనాభా పెరిగింది: రేవంత్
* విజన్-2047కు సహకరించండి: నీతిఆయోగ్తో చంద్రబాబు
* ఒంగోలులో ముగిసిన RGV విచారణ
* విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్
* కుంభమేళాలో సన్యాసినిగా మారిన మరో నటి
* ఒక్క వ్యక్తికే రతన్ టాటా ఆస్తిలో ₹500కోట్లు!
* జగన్పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
* వడ్డీరేట్లు తగ్గించిన RBI
* తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు.. ఈసీ కీలక ఆదేశాలు
Similar News
News February 8, 2025
10 నుంచి బోదకాలపై స్పెషల్ డ్రైవ్
ఫైలిరియాసిస్(బోదకాలు) నివారణకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 10న స్పెషల్ క్యాంపెయిన్ ప్రారంభించనుంది. ఏపీ సహా 13 రాష్ట్రాల్లోని 111 జిల్లాల్లో 2 వారాలపాటు కొనసాగనుంది. ఆరోగ్య కార్యకర్తలు ఇంటికే వచ్చి ఉచితంగా ఔషధాలు అందిస్తారని, తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. క్యూలెక్స్ దోమల కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దీనివల్ల కాళ్లతోపాటు ఇతర శరీర భాగాలు విపరీతంగా వాపునకు గురవుతాయి.
News February 8, 2025
మాజీ మంత్రి రజినీపై అట్రాసిటీ కేసు
AP: మాజీ మంత్రి విడదల రజినీపై చిలకలూరిపేట పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు. 2019లో సోషల్ మీడియాలో రజినీపై పోస్టు పెట్టినందుకు తనను సీఐ సూర్యనారాయణ ద్వారా హింసించారని పిల్లి కోటి అనే వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో రజినీ, ఆమె పీఏలతోపాటు అప్పటి సీఐపై కేసు నమోదైంది.
News February 8, 2025
SSMB29లో నానా పటేకర్?
రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్లో SSMB29 మూవీ షూటింగ్ ఇటీవల మొదలైంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ను మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. త్వరలో ఈ విషయంపై క్లారిటీ రానుంది. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అటవీ నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచరస్ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.