News February 8, 2025

పార్వతీపురం: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలకు హాల్ టిక్కెట్లు సిద్ధం

image

పార్వతీపురం జిల్లాలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు జరగనున్న విషయం తెలిసింది. వీరి హాల్ టికెట్లను కళాశాల లాగిన్ లోను, ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్లో పొందుపరిచామని పార్వతీపురం మన్యం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి డి. మంజులవీణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 

Similar News

News February 8, 2025

టెన్త్ ప్రశ్నపత్రాలపై QR కోడ్

image

TG: టెన్త్ క్వశ్చన్ పేపర్లపై క్యూఆర్ కోడ్, సీరియల్ నంబర్లను విద్యాశాఖ ముద్రించనుందని సమాచారం. ఎక్కడైనా లీకైతే అవి ఏ సెంటర్ నుంచి బయటికి వచ్చాయో సులభంగా తెలుసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. APలో గత ఏడాదే ఈ విధానం అమలు చేశారు. కాగా ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల కాగానే విద్యార్థుల మొబైల్‌కు మెసేజ్ పంపేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే హాల్‌టికెట్ రానుంది.

News February 8, 2025

NZB: యువకుడి ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ గొడవ

image

ముగ్గురు స్నేహితుల మధ్య జరిగిన గొడవ కారణంగా యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపిన వివరాలు.. కంజర గ్రామానికి చెందిన విశాల్(19) మరో ఇద్దరు స్నేహితుల మధ్య ఇన్‌స్టాగ్రామ్ విషయంలో గొడవ జరిగింది. దీంతో విశాల్ గత నెల 16న పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.

News February 8, 2025

కొడుకు ముందే ప్రాణాలు విడిచిన తల్లి

image

నార్పలకు చెందిన గంగమ్మ (45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. ఆమె తన కొడుకు మంజునాథ్‌తో కలిసి నార్పల నుంచి హిందూపురానికి బైక్‌లో వెళ్తున్నారు. దారి మధ్యలో CK పల్లి మండలం NS గేటు సమీపంలో బైక్ గుంతలోకి దిగడంతో ఆమె ఎగిరి కింద పడ్డారు. గంగమ్మ తలకు తీవ్రగాయమై మృతి చెందింది. ఘటనకు ర్యాష్ డ్రైవింగే కారణమని స్థానికులు తెలిపారు. మృతిరాలి భర్త ఈశ్వరయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. 

error: Content is protected !!