News March 19, 2024
వేసవిలో.. చల్లని విహారం
వేసవిలో చాలా మంది విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. సూర్యుడి భగభగల నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని ప్రదేశాలకు వెళ్తారు. ఇండియాలో సమ్మర్ వెకేషన్ ప్రాంతాలు చాలానే ఉన్నా.. ఊటీ, కొడైకెనాల్, గ్యాంగ్టక్, కశ్మీర్, చిరపుంజి, సిమ్లా పర్యాటక ప్రదేశాలు చాలా ఫేమస్. అక్కడి ఉష్ణోగ్రతలు 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. ఆయా ప్రదేశాల్లోని ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి అందాలు మంత్రముగ్ధులను చేస్తాయి.
Similar News
News July 5, 2024
BREAKING: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి
TG: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుత సీఈఓ వికాస్రాజ్ను ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది.
News July 5, 2024
చంద్రబాబు, రేవంత్ భేటీ.. ముహూర్తం ఫిక్స్
తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీకి ముహూర్తం ఖరారైంది. రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్లో ఇరువురు సమావేశం కానున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్లోని సంస్థల పంపిణీ, విద్యుత్ సంస్థలపై ప్రధానంగా చర్చ జరగనుంది.
News July 5, 2024
మా పిల్లలకు కోహ్లీ, రోహిత్ గురించి చెప్తాం: ఫ్యాన్స్
టీ20 వరల్డ్ కప్-2024 గెలవడంలో కీలకంగా వ్యవహరించి T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లీ చరిత్రలో నిలిచిపోతారని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. ‘క్రికెట్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మా తండ్రులు సచిన్, గంగూలీ గురించి చెప్పేవారు. మేము మా పిల్లలకు లెజెండ్స్ రోహిత్, కోహ్లీల గురించి చెప్తాం’ అని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. వీరి రిటైర్మెంట్తో ఓ శకం ముగిసిందంటున్నారు. మీరేమంటారు?