News February 8, 2025

జన్నారం: ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు ఎమ్మెల్యే.

image

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని చెక్‌పోస్ట్ వద్ద రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిషేధించి విధించిన ఆంక్షలు ఎత్తివేయడం జరిగిందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. ఈ విషయంపై చీప్ కన్జర్వేటర్‌కు శుక్రవారం వినతి పత్రం అందించామన్నారు. స్పందించిన CCF ఆధారాలు చూపించి రాకపోకలు సాధించుకోవచ్చు సాగించుకోవచ్చని తెలిపినట్లు పేర్కొన్నారు.

Similar News

News March 16, 2026

ఇమామ్, మౌజమ్ల బకాయిలు విడుదల చేస్తాం: సీఎం

image

ఇమామ్, మౌజమ్ల బకాయిలు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం తరఫున విజయవాడలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇప్పటికే ఇమామ్, మౌజన్లకు రూ. 5 వేలు, రూ. 10 వేల చొప్పున రూ. 180 కోట్లు అందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు పెద్ద ఎత్తున సంక్షేమం అందించామన్నారు.

News March 16, 2026

100కు ఫోన్ రాగానే ఘటనా స్థలానికి చేరుకోవాలి

image

బెట్టింగులు, నిషేధిత గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని భద్రాద్రి జిల్లా పోలీసులకు ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో జరిగిన నేర సమీక్షలో మాట్లాడుతూ.. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలు నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. 100కు ఫోన్ రాగానే ఘటనా స్థలానికి చేరుకోవాలని బాధితులకు అండగా నిలవాలన్నారు.

News March 16, 2026

సిద్దిపేట: ఈ నెల 22న సీఎం పర్యటనపై మంత్రుల సమీక్ష

image

సిద్దిపేట జిల్లా నర్మేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఈనెల 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సభకు వచ్చే రైతులకు తాగునీరు, రవాణా సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఏర్పాట్లపై అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు.