News February 8, 2025
దిలావర్పూర్: ఆయిల్ ఫామ్తో రైతులకు లాభసాటి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738931595590_51993896-normal-WIFI.webp)
ఆయిల్ ఫామ్ మొక్కలను నాటుకోవడంతో రైతులకు లాభదాయకంగా ఉంటుందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి వి. రమణ అన్నారు. దిలావర్పూర్ మండలంలో ఆయా రైతులు నాటిన తోటలను సందర్శించారు. అనంతరం రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలపై రాయితీ వివరాలు తెలిపారు. మొక్కలు నాటిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలను పేర్కొన్నారు. ఇందులో డివిజన్ మేనేజర్ శేఖర్, క్లస్టర్ ఆఫీసర్ ప్రశాంత్, రైతులు ఉన్నారు.
Similar News
News February 8, 2025
బాత్రూంలో 6 ఏళ్ల బాలికపై బస్సు డ్రైవర్ లైంగిక దాడి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738979025238_1212-normal-WIFI.webp)
శంషాబాద్లో ఇన్ఫాంట్ స్కూల్ విద్యార్థినిపై బస్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తిన విషయం తెలిసిందే. ఈ నెల 4న రంగారెడ్డి జిల్లా కాగజ్ఘాట్లోని సిరి నేచర్ రిసార్ట్కి పిక్నిక్కు వెళ్లిన 6 ఏళ్ల బాలికపై బస్డ్రైవర్ బాత్రూంలో లైంగికదాడి చేశాడని విద్యార్థిని తల్లి శుక్రవారం మంచాల PSలో ఫిర్యాదు చేసింది. పాప ఇంటికి వచ్చి నొప్పిగా ఉందని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
News February 8, 2025
BJPని గెలిపిద్దాం: కామారెడ్డి MLA
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738979175573_718-normal-WIFI.webp)
పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ BJP గెలవాలని కామారెడ్డి MLA వెంకటరమణరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కామారెడ్డిలో ఆయన మాట్లాడారు. అన్ని చోట్ల BJP గెలిచేలా ఇప్పటి నుంచే కార్యకర్తలు కృషి చేయాలని, ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా రెడీగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
News February 8, 2025
BJPని గెలిపిద్దాం: కామారెడ్డి MLA
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738979148156_718-normal-WIFI.webp)
పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ BJP గెలవాలని కామారెడ్డి MLA వెంకటరమణరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కామారెడ్డిలో ఆయన మాట్లాడారు. అన్ని చోట్ల BJP గెలిచేలా ఇప్పటి నుంచే కార్యకర్తలు కృషి చేయాలని, ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా రెడీగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.