News February 8, 2025
YLR: గీత దాటారు.. పార్టీ నుంచి వైదొలగారు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738936192648_50093551-normal-WIFI.webp)
ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పార్టీ నుంచి తొలగించారు. గత కొన్ని నెలల కింద కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ క్రమశిక్షణ అధ్యక్షుడు చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని తేల్చి చెప్పారు. కాగా సుభాష్ రెడ్డి రెండేళ్లలో పార్టీ నుంచి సస్పెండ్ కావడం ఇది రెండోసారి.
Similar News
News February 8, 2025
శైలజానాథ్కు కీలక పదవి ఇస్తారా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738982279308_727-normal-WIFI.webp)
పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరడంతో ఆ పార్టీ జిల్లా శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఎన్నికలకు మరో 4ఏళ్ల సమయం ఉండగా, కష్ట కాలంలో YCP తీర్థం పుచ్చుకోవడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా పార్టీకి ఆయన అదనపు బలం అని భావిస్తున్నాయి. మరోవైపు శైలజానాథ్కు జగన్ కీలక పదవి కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
News February 8, 2025
అనకాపల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికి?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738974617635_19090094-normal-WIFI.webp)
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికిస్తుందనే విషయంపై గందరగోళం నెలకొంది. ప్రస్తుత MLC పాకలపాటి రఘువర్మ నామినేషన్ వేసిన సందర్భంగా TDP ఎమ్మెల్సీ చిరంజీవిరావు మాట్లాడుతూ కూటమి మద్దతు రఘువర్మకేనని ప్రకటించారు. అయితే పీఆర్టీయూ, STUల మద్దతుతో పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ శుక్రవారం హాజరై మద్దతు ప్రకటించారు.
News February 8, 2025
ఢిల్లీ అసెంబ్లీ.. ఎప్పుడు ఏ పార్టీది అధికారం?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738981748264_695-normal-WIFI.webp)
1952లో 48 స్థానాలకు ఎన్నికలు జరగగా INC 39 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 1956-93 మధ్య ఎన్నికలు జరగలేదు. 1993లో 70 స్థానాలకు గాను BJP 49 చోట్ల గెలిచి సీఎం పదవి చేపట్టింది. 1998, 2003, 2008లో వరుసగా 52, 47, 43 స్థానాలతో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. 2013లో ఆప్(28)+కాంగ్రెస్(8) ప్రభుత్వం, 2015, 20లో వరుసగా 67, 62 స్థానాల్లో ఆప్ బంపర్ విక్టరీ సాధించింది. 2025 ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.