News February 8, 2025

జగిత్యాల: బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం

image

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివార్లలో వాగు వద్ద గల బావిలో ఓ వ్యక్తి మృతదేహం శుక్రవారం రాత్రి లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బహిర్భూమి కోసం వచ్చి ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటాడని తెలుపుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి ఎస్‌ఐ ఉదయ్ వెళ్లి పరిశీలించారు. మృతుడు జగిత్యాలకు చెందిన ఎండీ హమీద్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 8, 2025

BJPకి అండగా ముస్లిం మహిళలు!

image

ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయం సాధించడం వెనక ముస్లిం మహిళల పాత్ర ఉందని విశ్లేషకులు అంటున్నారు. ట్రిపుల్ తలాక్, సెంట్రల్ స్కీమ్స్ ఇందుకు దోహదం చేశాయని చెప్తున్నారు. ఆ మతంలోని పశుమందా వంటి వెనకబడిన వర్గాలు అండగా నిలిచాయని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, ఆప్ తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయన్న IUML ప్రెసిడెంట్ తొలిసారి బీజేపీకి ఓటేయడం, అనుచరులను ప్రభావితం చేయడమూ కలిసొచ్చిందని అంటున్నారు.

News February 8, 2025

‘లైలా’కు A సర్టిఫికెట్: విశ్వక్ సేన్

image

తన తాజా సినిమా ‘లైలా’కు సెన్సార్ బోర్డు ‘A’(పెద్దలకు మాత్రమే) సర్టిఫికెట్ ఇచ్చిందని హీరో విశ్వక్ సేన్ వెల్లడించారు. మూవీ చూస్తే ‘A’ సర్టిఫికెట్ ఎందుకో అర్థమవుతుందని పేర్కొన్నారు. ‘ప్రేక్షకులు రొటీన్ మూవీస్‌ని చూడటం లేదు. అందుకే ఇలాంటి విచిత్రమైన కథను సెలక్ట్ చేశాం. డైరెక్టర్ నాకు కథ చెప్పినప్పుడు నవ్వుతూనే ఉన్నాను. కానీ లేడీ గెటప్ వేయడమే కష్టంగా అనిపించింది’ అని స్పష్టం చేశారు.

News February 8, 2025

ఆమన్‌గల్‌కు 13న కేటీఆర్

image

రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్‌గల్‌లో బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు దీక్షకు పిలుపునిచ్చింది. ఈ నెల 13న పదిహేను వేల మందితో రైతు దీక్ష ఉండనుంది. ఈ దీక్ష మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నేతృత్వంలో జరగనుంది. ఈ కార్యక్రమనికి మాజీమంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. రైతు మహాదీక్షకి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు.

error: Content is protected !!