News February 8, 2025

పేరూరు: తల్లి మృతితో పిల్లలు కన్నీరుమున్నీరు

image

అమలాపురం మండలం పేరూరు కంసాల కాలనీలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లవరం మండలం గుడాలకి చెందిన కవిత నిన్న ఆత్మహత్యకు పాల్పడింది. భర్త సునీల్ నరసాపురంలో జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు స్కూలుకు వెళ్లాక ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తల్లి మరణించడంతో పిల్లల రోదన స్థానికులను కలిచివేసింది. CI కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 8, 2025

అదానీ మంచి మనసు.. రూ.10,000 కోట్ల డొనేషన్

image

కుమారుడు జీత్ అదానీ-దీవా షాల పెళ్లి సందర్భంగా వ్యాపారవేత్త గౌతమ్ అదానీ మంచి మనసు చాటుకున్నారు. సేవా కార్యక్రమాలకు రూ.10,000 కోట్లు వెచ్చిస్తానని ప్రతిజ్ఞ చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. పేదల ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఇతర సామాజిక కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారని వెల్లడించాయి. ‘సేవ చేయడమే భక్తి, సేవే ప్రార్థన, సేవే పరమాత్మ’ అనేది అదానీ ఫిలాసఫీ అని పేర్కొన్నాయి.

News February 8, 2025

అరవింద్ కేజ్రీవాల్ ఓటమి

image

ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీకి అతిపెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన కంచుకోట న్యూఢిల్లీ నుంచి ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆయన్ను 3182 ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ఆయన్ను నాలుగోసారి ప్రజలు తిరస్కరించారు. లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్, అవినీతి, క్లీన్ ఇమేజ్ పోవడం ఇందుకు కారణాలు.

News February 8, 2025

మెదక్ జిల్లాలో ఓటర్ల లెక్క తేలింది

image

గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం సిద్ధం అవుతోంది. మెదక్ జిల్లాలో 493 గ్రామపంచాయతీలుండగా, మొత్తం 5,25,478మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,52,797మంది, మహిళలు 2,72,672మంది ఉన్నారు. ఇతరులు 9మంది ఉన్నారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ జాబితాను అనుసరించి తాజాగా గ్రామపంచాయతీ ఓటర్ జాబితాను అధికారులు సిద్ధం చేశారు.

error: Content is protected !!