News March 19, 2024

కోదాడలో రూ.4,76,900 నగదు పట్టివేత

image

ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా నగదు, ఇతర విలువైన వస్తువులు రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని కోదాడ రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి అన్నారు. మంగళవారం కోదాడ రామాపురం ఎక్స్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలో విజయవాడ నుంచి హైదరాబాదు వెళుతున్న కారులో రూ.4,76,900 నగదు పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకొని ఎస్ఎస్ టీం అధికారి వినయ్ కుమార్‌కు అప్పగించినట్లు తెలిపారు.

Similar News

News October 28, 2025

నల్గొండ: పిచ్చికుక్క బీభత్సం.. ఏడుగురికి గాయాలు

image

నల్గొండ నాలుగో వార్డు, కేశరాజుపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఆ పిచ్చికుక్క దాడిలో ఏడుగురు గాయపడ్డారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైందని, రోడ్డుపై వెళ్లే బైకర్లను కూడా వెంటాడి గాయపరుస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, ఆ పిచ్చికుక్కను పట్టుకోవాలని వారు కోరుతున్నారు.

News October 28, 2025

NLG: శిశు విక్రయ ఘటనపై సీరియస్… కేసు నమోదు

image

నల్గొండ జిల్లాలో శిశు విక్రయం ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. శిశువును అమ్మిన తల్లిదండ్రులు బాబు, పార్వతితో పాటు కొనుగోలు చేసిన వ్యక్తులు, మధ్య దళారులుగా వ్యవహరించిన వారిపై కేసు నమోదు చేయాలని నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

News October 28, 2025

NLG: గొలుసు చోరీ.. వీరిని గుర్తిస్తే పారితోషకం

image

త్రిపురారం మండలం నీలయ్యగూడెంలో మహిళ మెడలో నుంచి పుస్తెలతాడును తెంపుకొని వెళ్లిన వ్యక్తులకు సంబంధించిన సీసీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. వారిని గుర్తించిన వారు త్రిపురారం పోలీస్ స్టేషన్‌లో సమాచారమివ్వాలని సూచించారు. త్రిపురారం పోలీస్ స్టేషన్ నంబర్ 87126 70196కి కాల్ చేసి చెప్పొచ్చని హాలియా సీఐ సతీష్ రెడ్డి కోరారు. వారికి తగిన పారితోషకం ఇస్తామని తెలిపారు.