News March 19, 2024

కోదాడలో రూ.4,76,900 నగదు పట్టివేత

image

ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా నగదు, ఇతర విలువైన వస్తువులు రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని కోదాడ రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి అన్నారు. మంగళవారం కోదాడ రామాపురం ఎక్స్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలో విజయవాడ నుంచి హైదరాబాదు వెళుతున్న కారులో రూ.4,76,900 నగదు పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకొని ఎస్ఎస్ టీం అధికారి వినయ్ కుమార్‌కు అప్పగించినట్లు తెలిపారు.

Similar News

News March 10, 2026

నల్గొండ: ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం ఫిర్యాదుల స్వీకరణ అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 10, 2026

నల్గొండ: ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం ఫిర్యాదుల స్వీకరణ అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 9, 2026

నల్గొండ: మార్చి 10 నుంచి పశువులకు టీకాలు

image

నల్గొండ జిల్లాలో పశువులకు గాలికుంటు వ్యాధి (FMD) నివారణకు మార్చి 10 నుంచి ఏప్రిల్ 9 వరకు ప్రత్యేక టీకా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ జి.వి. రమేష్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3 లక్షల పశువులకు టీకాలు వేసేందుకు 80 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రామాల వారీగా జరిగే ఈ ఉచిత టీకా కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.