News February 8, 2025
ఢిల్లీ అసెంబ్లీ.. ఎప్పుడు ఏ పార్టీది అధికారం?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738981748264_695-normal-WIFI.webp)
1952లో 48 స్థానాలకు ఎన్నికలు జరగగా INC 39 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 1956-93 మధ్య ఎన్నికలు జరగలేదు. 1993లో 70 స్థానాలకు గాను BJP 49 చోట్ల గెలిచి సీఎం పదవి చేపట్టింది. 1998, 2003, 2008లో వరుసగా 52, 47, 43 స్థానాలతో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. 2013లో ఆప్(28)+కాంగ్రెస్(8) ప్రభుత్వం, 2015, 20లో వరుసగా 67, 62 స్థానాల్లో ఆప్ బంపర్ విక్టరీ సాధించింది. 2025 ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Similar News
News February 8, 2025
BJPకి ఓట్ల వర్షం.. 27 ఏళ్ల కల నెరవేరిన వేళ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739000733082_782-normal-WIFI.webp)
PM మోదీ ‘డబుల్ ఇంజిన్’ నినాదం పని చేయడంతో దేశ రాజధాని ఢిల్లీలో BJP 27 ఏళ్ల కల నెరవేరింది. 1998లో BJP చివరి CMగా సుష్మాస్వరాజ్ పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, ఆప్లే దేశ రాజధానిని ఏలాయి. ఆప్ అగ్రనేతలపై అవినీతి మచ్చ, కాంగ్రెస్ ప్రభావం లేకపోవడం ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసొచ్చాయి. ప్రజలకు ఉపయోగపడే పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్తవి అమలు చేస్తామని చెప్పడంతో BJPకి ఓట్ల వర్షం కురిసింది.
News February 8, 2025
ఢిల్లీ సచివాలయంలో ఆంక్షలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92022/1662720797697-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో AAP ఓటమి ఖాయమైంది. దీంతో సచివాలయంలో ఫైల్స్, రికార్డ్స్ భద్రపరచాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. ఏ ఒక్క ఫైల్ కూడా అనుమతి లేకుండా బయటకు తీసుకెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. గత పదేళ్లుగా ఆప్ అవినీతిపై బీజేపీ ఆరోపణలు చేయడం, తాము అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో చెప్పడంతో తాజా ఆదేశాలు కీలకంగా మారాయి.
News February 8, 2025
ముగ్గురు పిల్లల్ని కనండి.. హిందువులకు VHP పిలుపు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738974638003_695-normal-WIFI.webp)
ప్రస్తుత జనన రేటు(1.9 శాతం) ప్రకారం హిందూ జనాభా తగ్గుతూనే ఉంటుందని VHP జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ చెప్పారు. జనాభా అసమతుల్యతను అధిగమించేందుకు ప్రతి హిందూ జంట ఇద్దరు/ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రతిజ్ఞ చేయాలన్నారు. కుటుంబాలు విడిపోవడం పిల్లలు, యువతలో అభద్రతకు కారణమవుతోందని తెలిపారు. హిందూ సంప్రదాయాలు పాటించడమే ఈ సమస్యకు పరిష్కారమన్నారు.