News February 8, 2025

అనకాపల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికి?

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికిస్తుందనే విషయంపై గందరగోళం నెలకొంది. ప్రస్తుత MLC పాకలపాటి రఘువర్మ నామినేషన్ వేసిన సందర్భంగా TDP ఎమ్మెల్సీ చిరంజీవిరావు మాట్లాడుతూ కూటమి మద్దతు రఘువర్మకేనని ప్రకటించారు. అయితే పీఆర్టీయూ, STUల మద్దతుతో పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ శుక్రవారం హాజరై మద్దతు ప్రకటించారు.

Similar News

News February 8, 2025

అన్నమయ్య: తండ్రి, కూతురు మృతి UPDATE

image

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాద మృతుల వివరాలు లభించినట్లు ఎస్సై నరసింహుడు తెలిపారు. మృతులు మదనపల్లి ప్రశాంత్ నగర్‌కు చెందిన భవన కార్మికుడు సోమశేఖర్(35), కుమార్తె సిద్దేశ్వరి(03)గా గుర్తించామన్నారు. కదిరిలో పెదనాన్న అంత్యక్రియలకు బైకులో వెళుతుండగా.. ములకలచెరువు వద్ద ఐచర్ వాహనం ఢీకొట్టి తండ్రి, కుమార్తె చనిపోగా.. భార్య కవిత (25), కొడుకు రెడ్డి శేఖర్(05)ని రుయాకు తరలించారు.

News February 8, 2025

ముగ్గురు పిల్లల్ని కనండి.. హిందువులకు VHP పిలుపు

image

ప్రస్తుత జనన రేటు(1.9 శాతం) ప్రకారం హిందూ జనాభా తగ్గుతూనే ఉంటుందని VHP జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ చెప్పారు. జనాభా అసమతుల్యతను అధిగమించేందుకు ప్రతి హిందూ జంట ఇద్దరు/ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రతిజ్ఞ చేయాలన్నారు. కుటుంబాలు విడిపోవడం పిల్లలు, యువతలో అభద్రతకు కారణమవుతోందని తెలిపారు. హిందూ సంప్రదాయాలు పాటించడమే ఈ సమస్యకు పరిష్కారమన్నారు.

News February 8, 2025

బెల్లంపల్లిలో బీర్ సీసాలతో దాడి 

image

బెల్లంపల్లిలోని ఓ బార్‌లో బీర్ సీసాలతో దాడి చేసుకోవడం భయాందోళన సృష్టించింది. 2 టౌన్ SI మహేందర్ వివరాల ప్రకారం.. స్థానిక గొల్లగూడెంకు చెందిన సాగర్ స్నేహితులతో కలిసి కాల్ టెక్స్‌లోని బార్‌లో మద్యం తాగుతున్నారు. అదే బార్‌లో మద్యం తాగుతున్న తాండూర్‌కు చెందిన వంశీ మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. సాగర్, అతని స్నేహితులు బీర్ సీసా పగలగొట్టి వంశీపై దాడి చేశారు. గొడవపై కేస్ నమోదైంది.

error: Content is protected !!