News February 8, 2025

తడ : హైవేపై ప్రమాదం

image

తడ మండలం కొండూరు హైవేపై ప్రమాదం జరిగింది. సూళ్లూరుపేట వైపు నుంచి తడ వైపు బైక్‌పై వెళుతున్న సినోఫర్ మహమ్మద్ (నెల్లూరు), జ్యోతి బాబే (గుమ్మిడిపూడి) అనే ఇద్దరు యువకులు ముందు వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సును ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన తడ హైవే మొబైల్ వాహనం సహాయంతో సూళ్లూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు.

Similar News

News February 8, 2025

RESULTS: ఇప్పటివరకు ఎవరికి ఎన్ని సీట్లు?

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మేజిక్ ఫిగర్ దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ 19 చోట్ల విజయం సాధించగా మరో 27 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అధికారం చేపట్టాలంటే 36 సీట్లు అవసరం. కానీ ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే కాషాయ పార్టీ అంతకుమించిన స్థానాల్లో గెలుపొందేలా కనిపిస్తోంది. మరోవైపు కేజ్రీవాల్, సిసోడియా ఓటములతో చతికిలపడ్డ ఆప్ 8 చోట్ల గెలుపొందింది. మరో 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

News February 8, 2025

నిజామాబాద్: రేటు రాక పసుపు రైతుల్లో ఆందోళన

image

నిజామాబాద్ మార్కెట్లో కొన్ని రోజులుగా పసుపు కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే ధర మాత్రం గతేడాది కంటే తక్కువ ఉందని రైతులు చెబుతున్నారు. గత సీజన్లో మొదట 13 వేలకు క్వింటాలు ఉండగా ప్రస్తుత సీజన్లో అది 11 వేలకు పడిపోయింది. తెగుళ్లు సోకి పంట దిగుబడి తగ్గడం మరో వైపు ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

News February 8, 2025

AAPకి అధికారం ఎందుకు దూరమైందంటే?

image

2015, 2020 ఎన్నికల్లో 70 స్థానాలకు 67, 62 స్థానాల్లో అద్భుత విజయం సాధించి అధికారంలోకి వచ్చిన AAPను ఈసారి పలు వివాదాలు చుట్టుముట్టాయి. హామీలు అమలు చేయకపోవడం, ఎయిర్ క్వాలిటీపై ప్రజల అసంతృప్తి, CM అధికార నివాసం శేష్ మహల్‌ను రూ.33.66 కోట్లతో అభివృద్ధి చేసుకోవడంపై ఆరోపణలు, AK అవినీతిపై BJP ప్రచారం, లిక్కర్ స్కాంలో AK, మంత్రులు, AAP నేతలు జైలుకెళ్లడంతో పాలన గాడితప్పి ఆ పార్టీని అధికారానికి దూరం చేశాయి.

error: Content is protected !!