News February 8, 2025

వనపర్తి: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

ఈ నెల 2వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరిన చంద్రమోహన్, లక్ష్మమ్మల కారు కొత్తకోట ముమ్మళ్లపల్లి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మకు తీవ్ర గాయాలు కాగా.. HYDలోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News March 5, 2026

హార్ముజ్ జలసంధిలో 23వేల మంది ఇండియన్స్!

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో రాకపోకలను ఇరాన్ అడ్డుకుంటోంది. దీంతో గల్ఫ్ రీజియన్‌లో 36 ఇండియన్ కార్గో షిప్స్ నిలిచిపోయాయి. వీటిలో LPG, LNG క్యారియర్స్, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్స్, కంటెయినర్ షిప్స్ ఉన్నాయి. ఈ క్రమంలో వాటిలో 23 వేల మంది ఇండియన్ సైలర్స్ చిక్కుకుపోయినట్లు సమాచారం. ఒమన్ ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్‌పై జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

News March 5, 2026

కర్నూలు DCCB సీఈవోగా శివలీల

image

కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(DCCB) నూతన ముఖ్య కార్యనిర్వహణాధికారి(CEO)గా కొమ్మ శివలీల నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె గురువారం బాధ్యతలు స్వీకరించారు. తన నియామకానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. బ్యాంకును అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. బ్యాంకులో మొండి బకాయిల(NPA) వసూళ్లను వేగవంతం చేసి, ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తామన్నారు.

News March 5, 2026

భీమవరం: మహిళా దినోత్సవ నిర్వహణపై జేసీ సమీక్ష

image

ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం విష్ణు కళాశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లడారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేడుకల నిర్వహణకు ప్రత్యేక అధికారులు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మహిళా సాధికారత ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాలు ఉండాలని ఆయన సూచించారు.