News February 8, 2025
ఆప్కు బిగ్ షాక్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738985516205_653-normal-WIFI.webp)
అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడదామనుకున్న ఆప్కు ఫలితాల్లో ఎదురుగాలి వీస్తోంది. BJP 42 చోట్ల లీడింగ్లో ఉండగా ఆ పార్టీ కేవలం 25 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకంటే ముఖ్యంగా ఆప్ అగ్రనేతలు వెనుకంజలో ఉండటం పార్టీ శ్రేణులను షాక్కు గురి చేస్తోంది. కేజ్రీవాల్, ఆతిశీ, మనీశ్ సిసోడియా, ఇమ్రాన్ హుస్సేన్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వెనుకంజలోనే కొనసాగుతున్నారు.
Similar News
News February 8, 2025
రెపోరేటు తగ్గింపు.. EMI ఎంత తగ్గుతుందంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738998543738_81-normal-WIFI.webp)
RBI రెపోరేటును 6.25శాతానికి తగ్గించింది. దీంతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై EMI కూడా తగ్గనుంది. 20 ఏళ్ల కాలపరిమితికి రూ.20 లక్షల ఇంటి రుణం తీసుకున్న వారికి ఏడాదికి రూ.3,816, రూ.30 లక్షలైతే రూ.5,712, రూ.50 లక్షలు తీసుకుంటే రూ.9,540 తగ్గుతుంది. అలాగే ఐదేళ్ల కాలపరిమితికి కారు లోన్లు తీసుకుంటే రూ.5 లక్షలకు ఏడాదికి రూ.732, రూ.7 లక్షలకు రూ.1020, రూ.10 లక్షలకు రూ.1464 వరకు EMI తగ్గుతుంది.
News February 8, 2025
ఆప్ ఓటమి.. స్వాతి మాలీవాల్ ట్వీట్ వైరల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739004450139_746-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా కేవలం ‘ద్రౌపది వస్త్రాపహరణం’ ఫొటోతో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అని, ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అని, ఎంతో కష్టపడి బీజేపీని గెలిపించారని కామెంట్స్ చేస్తున్నారు. స్వాతి కష్టాన్ని బీజేపీ గుర్తిస్తుందని అంటున్నారు.
News February 8, 2025
బీజేపీ గెలుపుతో కేటీఆర్కు ఆనందం: మంత్రి పొన్నం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738566626994_893-normal-WIFI.webp)
TG: ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి కన్నా బీజేపీ గెలుపే <<15396872>>KTR<<>>కు చాలా ఆనందం కలిగిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేసుల నుంచి విముక్తి పొందాలని బీజేపీ భజన చేస్తున్నారని విమర్శించారు. దేశాన్ని ఏలుతామని పార్టీ పేరు మార్చుకున్న బీఆర్ఎస్ ఢిల్లీ ఎన్నికల సమయంలో ఎక్కడికి పోయిందన్నారు. మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే బీఆర్ఎస్ నాయకులు శునకానందం పొందారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.