News February 8, 2025
సంగారెడ్డి: 10th ఎఫ్ఏ మార్కుల రికార్డుల పరిశీలనకు ప్రత్యేక బృందాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738984022706_52434823-normal-WIFI.webp)
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల ఎఫ్ఏ మార్కుల రికార్డుల పరిశీలనకు పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 20వ తేదీ వరకు అన్ని పాఠశాలలను సందర్శించి రికార్డుల పరిశీలన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో సుమారుగా 70 పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
Similar News
News February 8, 2025
బెల్లంపల్లి రేంజ్లోనే పులి ఆవాసం!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739009534091_51297756-normal-WIFI.webp)
గత 10రోజులుగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని అటవీ ప్రాంతం నుంచి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పరిధిలో పులి సంచరిస్తూ అడవి ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. అటవీ శాఖ అధికారి పూర్ణచందర్ ఆధ్వర్యంలో సిబ్బంది శనివారం ఉదయం కాసిపేట మండలం వరిపేట గ్రామ సరిహద్దుల్లో పులి పాదముద్రలు గుర్తించినట్లు తెలిపారు. అటవీ సమీప చేలల్లో పంటలు ఎలా కాపాడుకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.
News February 8, 2025
కేజ్రీవాల్ ఓటమికి 2 కారణాలు: పీసీసీ చీఫ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739010569256_367-normal-WIFI.webp)
BRSతో స్నేహం, కాంగ్రెస్తో పొత్తు తెంచుకోవడం వల్లే ఆప్ ఓడిపోయిందని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ కూతురు కవితతో లిక్కర్ వ్యాపారం ఆరోపణలు కేజ్రీవాల్ పతనానికి పునాదులు వేశాయని చెప్పారు. అవినీతిరహిత నినాదంతో కేజ్రీవాల్ దేశస్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్నారని, కానీ లిక్కర్ స్కాం దానికి తూట్లు పొడిచిందన్నారు. ఇక కాంగ్రెస్తో పొత్తు వద్దన్న ఆయన నిర్ణయం బీజేపీ నెత్తిన పాలు పోసిందని పేర్కొన్నారు.
News February 8, 2025
టెన్త్ అర్హతతో 1,124 ఉద్యోగాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1722947013757-normal-WIFI.webp)
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 1,124 ఖాళీలకు మార్చి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్/డ్రైవర్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులున్నాయి. టెన్త్ పాసై డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, 21-27 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. ఫిజికల్ టెస్ట్, రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.21,700-రూ.69,100 వరకు ఉంటుంది.
వెబ్సైట్: <