News February 8, 2025
BJPకి షాక్: మెజార్టీ నంబర్ వైపు AAP
ఢిల్లీలో ఓట్ల లెక్కింపు సాగే కొద్దీ పార్టీల ఆధిక్యాలు మారుతున్నాయి. అరగంట క్రితం 50 స్థానాల్లో దూకుడు ప్రదర్శించిన బీజేపీ ప్రస్తుతం 41కి తగ్గిపోయింది. ఇక ఆమ్ఆద్మీ పార్టీ 18 నుంచి 28కి పుంజుకుంది. చాలాచోట్ల అభ్యర్థుల ఆధిక్యాలు 500 నుంచి 1000 మధ్యే ఉంటున్నాయి. దీంతో ప్రతి రౌండ్ ముగిసే సరికి నంబర్లు అటూ ఇటూ మారుతున్నాయి. మెజారిటీని నిర్ణయించడంలో ముస్లిం ఆధిపత్య నియోజకవర్గాలు కీలకం కానున్నాయి.
Similar News
News February 8, 2025
కేసీఆర్ను కలిసిన వారంతా ఓటమి: కాంగ్రెస్
ఢిల్లీలో బీజేపీ గెలవడంతో రాహుల్ గాంధీని అభినందిస్తూ KTR చేసిన సెటైరికల్ ట్వీట్కు కాంగ్రెస్ నేతలు కౌంటరిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ BRS చీఫ్ KCRను కలవడం వల్లే ఓడిపోయారని ట్వీట్స్ చేస్తున్నారు. ‘మనం చెయ్యి కలిపితే మామూలుగా లేదుగా. YS జగన్, నవీన్ పట్నాయక్, థాక్రే, కేజ్రీవాల్’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఢిల్లీలో కాంగ్రెస్ మరోసారి సున్నా సీట్లు గెలిచిందని BRS శ్రేణులూ రీకౌంటరిస్తున్నాయి.
News February 8, 2025
ఇవాళ ‘పుష్ప-2’ థాంక్యూ మీట్
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప-2’ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఓటీటీలోకి వచ్చేసిన ఈ మూవీ టాప్ ప్లేస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ఇవాళ ‘థాంక్యూ మీట్’ నిర్వహించనున్నట్లు మూవీ యూనిట్ పోస్ట్ చేసింది. సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.
News February 8, 2025
ఖట్టర్ ఇమాందార్.. ఇమేజ్ ఖతం!
లూజు ప్యాంటు. పొడవు చొక్కా. జేబులో రెనాల్డ్స్ పెన్ను. తలకు మఫ్లర్. పర్ఫెక్టుగా డిజైన్ చేసుకున్న సామాన్యుడి ఇమేజ్. ప్రజల డబ్బుకు ఖట్టర్ ఇమాందార్గా ఉంటానని ప్రతిజ్ఞ. అవినీతి రహిత రాజకీయాలు చేస్తానన్న హామీతో వరుసగా 3సార్లు గెలుపు. కట్చేస్తే శీశ్మహల్లో గోల్డ్ ప్లేటెడ్ కమోడ్. వేగనార్ పోయి బెంజ్ వచ్చే. లిక్కర్, వాటర్ స్కాములు. అవినీతి ఆరోపణలు. జైల్లోనూ పదవిపై వ్యామోహం. కళంకిత ఇమేజ్తో AKకు శరాఘాతం!