News February 8, 2025
ఢిల్లీ ఫలితాలపై ప.గో. జిల్లాలో టెన్షన్

ఢిల్లీలో ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ రేగుతోంది. అయితే ఢిల్లీ ఎన్నికల సెగ జిల్లాను సైతం సాగుతోంది. ఢిల్లీలో నేడు వెల్లడి కానున్న ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా పందేలు సాగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, ఆప్ మధ్య పోరు జరుగుతుండగా ఇక్కడి పందెం రాయుళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తుది ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడయ్యేసరికి పెద్ద ఎత్తున నగదు చేతులు మారనుంది.
Similar News
News February 27, 2026
ఉండి: RRR ను పరామర్శించిన సినీనటుడు మోహన్బాబు

క్రీడా పోటీల్లో గాయపడి, ప్రస్తుతం హైదరాబాద్లో చికిత్స పొందుతున్న ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజును ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు శుక్రవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మోహన్ బాబు, రఘురామ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
News February 27, 2026
ప.గో జిల్లా కలెక్టర్ ఆగ్రహం

ఏకీకృత కుటుంబ సర్వేను శనివారం సాయంత్రానికి వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెదమిరం క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో నిర్వహించిన గూగుల్ మీట్ సమీక్షలో ఆమె మాట్లాడారు. నిరంతరం వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా పర్యవేక్షిస్తున్నప్పటికీ, సర్వేలో ఆశించిన ప్రగతి కనిపించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశిత గడువులోగా ప్రక్రియను ముగించాలని స్పష్టం చేశారు.
News February 27, 2026
నిజం దాగదు.. RRRపై ఐపీఎస్ సంచలన పోస్ట్

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ‘ఎక్స్’ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. “సాధారణంగా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి.. మరి కస్టడీలో అంత దారుణంగా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి?” అని ప్రశ్నించారు. అబద్ధాలు బయటపడుతున్నాయని, నిజం ఎప్పటికీ దాగదని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.


