News February 8, 2025
ఆప్ను గెలిపించే బాధ్యత మాది కాదు: కాంగ్రెస్
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ను గెలిపించే బాధ్యతేమీ తమకు లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే వ్యాఖ్యానించారు. ‘వారి గెలుపు బాధ్యత మాది కాదు కదా? స్ఫూర్తిదాయకమైన పోరాటంతో ఎన్నికల్లో బలమైన ప్రదర్శన చేయడమే మా బాధ్యత. కేజ్రీవాల్ గోవా, హరియాణా, గుజరాత్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేశారు కదా? గోవా, ఉత్తరాఖండ్లో ఆప్కు వచ్చిన ఓట్ల తేడాతోనే మేం ఓడిపోయాం’ అని గుర్తుచేశారు.
Similar News
News February 8, 2025
లా సెట్, ఈసెట్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది
TG: లా సెట్, ఈసెట్ పరీక్షలకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 25న నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయి. మార్చి 3 నుంచి ఏప్రిల్ 19 వరకు ఈసెట్, మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు లాసెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 12న ఈసెట్, జూన్ 6న లాసెట్ పరీక్ష జరగనుంది.
News February 8, 2025
కవిత వల్లే ఢిల్లీలో ఆప్ ఓటమి: కొండా సురేఖ
TG: BRS MLC కల్వకుంట్ల కవితతో కలిసి కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ చేయడం వల్లే ఆప్ ఎన్నికల్లో ఓడిపోయిందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. BRS పార్టీ ఎక్కడికెళ్లినా భస్మాసుర హస్తమేనని ఢిల్లీ ఎన్నికలతో తేలిపోయిందని ఎద్దేవా చేశారు. ‘ఢిల్లీ ఫలితాలనుద్దేశించి రాహుల్ గాంధీపై KTR వ్యాఖ్యలు అహంపూరితం. ఈ అహంకారాన్నిఅణచివేసేందుకే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారు’ అని ఆమె ఫైర్ అయ్యారు.
News February 8, 2025
ఉపఎన్నికల్లో అధికార పార్టీలదే హవా!
అయోధ్యలోని మిల్కిపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. ఎస్పీ అభ్యర్థి అజిత్ ప్రసాద్పై బీజేపీ క్యాండిడేట్ చంద్రభాను పాస్వాన్ 61,710 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఫైజాబాద్ లోక్సభ స్థానంలో ఓటమి తర్వాత ఈ విజయంతో బీజేపీకి ఊరట దక్కింది. మరోవైపు తమిళనాడు ఈరోడ్ ఈస్ట్ ఉపఎన్నికలో డీఎంకే అభ్యర్థి ఛాందీరకుమార్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు.