News February 8, 2025

సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయానికి మోదీ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ సంబరాలకు సిద్ధమవుతోంది. కేంద్ర కార్యాలయంలో సాయంత్రం సెలబ్రేషన్స్ చేసుకోనుంది. దీనికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా హాజరుకానున్నారు.

Similar News

News March 20, 2026

పెట్రోల్, డీజిల్ ధరలపై IOCL కీలక ప్రకటన

image

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ దేశంలో సాధారణ వాహన ఇంధన ధరలను పెంచబోమని IOCL ప్రకటించింది. ప్రీమియం పెట్రోల్ XP-95(పవర్ పెట్రోల్) రేట్లను మాత్రమే పెంచామని, ఈ ప్రభావం స్వల్ప స్థాయిలోనే ఉంటుందని తెలిపింది. సరసమైన ధరల్లో స్థిరమైన సరఫరాకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. కాగా <<19432956>>పవర్ పెట్రోల్<<>> లీటర్‌పై రూ.2.35 వరకు, ఇండస్ట్రియల్ డీజిల్ లీటర్‌పై రూ.22 పెంచిన విషయం <<19434174>>తెలిసిందే.<<>>

News March 20, 2026

ధురంధర్-2 చెత్త సినిమా.. నటి విమర్శలు

image

‘ధురంధర్-2’పై ప్రశంసలు వెల్లువెత్తుతుంటే కన్నడ నటి రమ్య స్పందన తీవ్ర విమర్శలు చేశారు. ‘ఇప్పుడే ధురంధర్-2 సినిమా చూశా. ఇది నా ఓపికకు పరీక్ష పెట్టింది. ఇదో చెత్త సినిమా. బోరింగ్ సబ్జెక్ట్ చదివినట్లు ఉంది. ఈ మూవీ చూసి సమయం, డబ్బులు వృథా చేసుకోకండి. దర్శకత్వం, డైలాగ్స్, ఎడిటింగ్, BGM, నటన.. ఏవీ బాలేవు. డైరెక్టర్ ఆదిత్య ధర్.. మీ మితిమీరిన జాతీయవాదం, దుష్ప్రచారాన్ని ఆపండి’ అని ట్వీట్ చేశారు.

News March 20, 2026

శ్రీవారి సన్నిధిలో ఇక కల్తీకి చెక్: సత్యకుమార్

image

AP: శ్రీవారి లడ్డూ, అన్న ప్రసాదాల్లో నాణ్యత, స్వచ్ఛత పెంచేలా చర్యలు తీసుకున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘తిరుమలలో ఏర్పాటైన స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని CM CBN రేపు ప్రారంభిస్తారు. నెయ్యి, నూనె, పాలు, ఇతర ముడిసరకుల్లో కల్తీని పసిగట్టే పరీక్షలు ఇక్కడ జరుగుతాయి. ఫెస్టిసైడ్స్, ప్రిజర్వేటివ్స్ వంటి అవశేషాలనూ గుర్తిస్తారు. పుణ్య క్షేత్రాల్లో ఇలాంటి ల్యాబ్ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి’ అని తెలిపారు.