News February 8, 2025

షాద్‌నగర్: 10న అప్రెంటిస్ షిప్ మేళా

image

షాద్‌నగర్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 10వ తేదీన అప్రెంటిస్ షిప్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మణ్ తెలిపారు. ఉదయం 10 గం.లకు కళాశాలలో ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

Similar News

News March 17, 2026

పాలమూరు: రైతులు ALERT.. అప్లై చేసుకోండి

image

‘రైతు భరోసా’ కొత్త దరఖాస్తులు, బ్యాంక్ వివరాల అప్డేట్ కోసం రైతులు ఈనెల 25లోగా దరఖాస్తులు చేసుకోవాలని పెద్దవార్వాల్ ఏఈఓ శివలీల ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఆధార్, పట్టాదార్ పాస్ బుక్ (28/02/2026 వరకు వచ్చిన కొత్త పట్టా), బ్యాంక్ పాస్ బుక్, మొబైల్ నంబర్, రైతు భరోసా అప్లికేషన్ ఫారంతో వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలన్నారు. అర్హత గల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. SHARE IT

News March 17, 2026

MBNR: ఎస్సీ యువతకు భారీ సబ్సిడీ రుణాలు

image

నిరుద్యోగ ఎస్సీ యువత స్వయం ఉపాధి కోసం రూ. 1 నుంచి రూ.7 లక్షల వరకు రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సునీత తెలిపారు. దీనిపై 50% నుంచి 90% వరకు సబ్సిడీ ఉంటుంది. 21-50 ఏళ్ల మధ్య వయస్సు వారు మార్చి 24లోపు TGOBMMS పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 98499 05996ను సంప్రదించవచ్చు.

News March 17, 2026

మహమ్మదాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం రాత్రి వివిధ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా మహమ్మదాబాద్‌లో 10.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. హన్వాడ 7.0, నవాబుపేట 6.5, గండీడ్ మండలం సల్కర్ పేట 4.5, మిడ్జిల్ మండలం దోనూరు 2.3, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 1.5, బాలానగర్ 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. వర్షం కురిసిన ప్రాంతంలో వాతావరణ ఒక్కసారిగా చల్లబడింది.