News February 8, 2025
KMR: ‘స్థానిక’ ఎన్నికలు.. కాంగ్రెస్, BRS, BJP మంతనాలు

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో కామారెడ్డి జిల్లాలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS, BJPకి చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్యులను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.
Similar News
News April 18, 2026
బీజేపీ నుంచే అత్యల్పంగా మహిళా ఎంపీలు: మహువా

మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోవడంతో విపక్షాలపై PM మోదీ సహా BJP నేతలు చేస్తున్న విమర్శలకు TMC MP మహువా మొయిత్రా Xలో కౌంటరిచ్చారు. లోక్సభలో BJP నుంచే అత్యల్పంగా మహిళా MPలు(240 మందిలో 31 మంది.. 12.90%) ఉన్నారని గుర్తు చేశారు. తమ పార్టీ నుంచి గెలిచిన 29 మంది MPల్లో 11 మంది మహిళలు(37.90%) అని పేర్కొన్నారు. ఇప్పుడున్న 543 సీట్లకు ఉమెన్ రిజర్వేషన్ అమలు చేయకుండా ఎవరు ఆపుతున్నారని ప్రశ్నించారు.
News April 18, 2026
విధుల పట్ల అంకితభావంతో ఉండాలి: ADB SP

పోలీసు సిబ్బంది అంకితభావం, నిజాయితీతో విధులు నిర్వహించాలని SP అఖిల్ మహాజన్ ఆదేశించారు. శనివారం సెట్ కాన్ఫరెన్స్ ద్వారా సిబ్బందికి మార్గదర్శనం చేశారు. యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలని, ఎండాకాలం దృష్ట్యా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అరైవ్ అలైవ్ కృషిని అభినందిస్తూ.. రికార్డుల నవీకరణ, బాధితులతో మర్యాదపూర్వక ప్రవర్తన ఉండాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
News April 18, 2026
ముండూరులో భూగర్భ జలమట్టాలను పరిశీలించిన కలెక్టర్

ముండూరులో శనివారం కలెక్టర్ కె.వెట్రిసెల్వి పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన రెండు ఫిజియో మీటర్ల ద్వారా భూగర్భ జలమట్టాలను టెలిమీటరీ విధానంలో ఆమె స్వయంగా పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 72 పిజోమీటర్ల ద్వారా భూగర్భ జలాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. మార్చి నెలలో జిల్లా సగటు నీటిమట్టం 21.23 మీటర్లు ఉండగా, ముండూరులో ప్రస్తుతం 23.38 మీటర్లుగా నమోదైందని వివరించారు.


