News February 8, 2025

BJPకి ఓట్ల వర్షం.. 27 ఏళ్ల కల నెరవేరిన వేళ

image

PM మోదీ ‘డబుల్ ఇంజిన్’ నినాదం పని చేయడంతో దేశ రాజధాని ఢిల్లీలో BJP 27 ఏళ్ల కల నెరవేరింది. 1998లో BJP చివరి CMగా సుష్మాస్వరాజ్ పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, ఆప్‌లే దేశ రాజధానిని ఏలాయి. ఆప్ అగ్రనేతలపై అవినీతి మచ్చ, కాంగ్రెస్ ప్రభావం లేకపోవడం ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసొచ్చాయి. ప్రజలకు ఉపయోగపడే పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్తవి అమలు చేస్తామని చెప్పడంతో BJPకి ఓట్ల వర్షం కురిసింది.

Similar News

News February 8, 2025

టాప్‌లో సింగపూర్ పాస్‌పోర్ట్.. భారత్ ప్లేస్ ఎంతంటే?

image

ప్రపంచంలోనే సింగపూరియన్ పాస్‌పోర్ట్ మోస్ట్ పవర్‌ఫుల్‌గా నిలిచింది. దీని ద్వారా ప్రపంచంలోని 193 దేశాలకు వీసా లేకుండా/వీసా ఆన్ అరైవల్ వెళ్లవచ్చు. హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ రూపొందించిన ఈ జాబితాలో భారత్ 80వ స్థానంలో నిలిచింది. మన పాస్‌పోర్టుతో 56 దేశాలకు వెళ్లవచ్చు. సింగపూర్ తర్వాతి స్థానాల్లో సౌత్ కొరియా, జపాన్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, ఐర్లాండ్, ఫిన్‌లాండ్, డెన్మార్క్ దేశాలు ఉన్నాయి.

News February 8, 2025

ఢిల్లీలో కాంగ్రెస్ ‘జీరో హ్యాట్రిక్’ రికార్డ్ ఇందుకేనేమో?

image

ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్నఢిల్లీ, ప్రస్తుతం సున్నాలతో హ్యాట్రిక్ కొట్టింది. 2013లో హస్తం పార్టీ తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ప్రజలు ఆప్ వైపు మెుగ్గుచూపారు. షీలాదీక్షిత్ తర్వాత మోదీ, కేజ్రీవాల్‌ను ఎదుర్కొనే నాయకుడు దొరకలేదు. కిందిస్థాయి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో పార్టీ విఫలమైంది. వీటితో పాటు ఇండియా కూటమి విభేదాలు పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టినట్లు భావిస్తున్నారు.

News February 8, 2025

‘మీసేవ’లో రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించట్లేదు: పౌరసరఫరాలశాఖ

image

TG: ‘మీసేవ’ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులపై పౌరసరఫరాలశాఖ క్లారిటీ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డులకు ‘మీసేవ’ ద్వారా అప్లికేషన్లు స్వీకరించట్లేదని, దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేయాలని మాత్రమే ‘మీసేవ’ను కోరామని వెల్లడించింది. మార్పులు, చేర్పులకు ‘మీసేవ’ ద్వారా దరఖాస్తులు వస్తున్నాయని పేర్కొంది.

error: Content is protected !!