News February 8, 2025
ఆహార శుద్ధి పరిశ్రమకు అగ్రిమెంట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739003863948_14560643-normal-WIFI.webp)
భూపాలపల్లి, ములుగు జిల్లాలోని రైతు సోదరులతో అగ్రిమెంట్ చేయించుకుని ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు భూపాలపల్లి జిల్లా వ్యవసాయ సంక్షేమ సంఘం తరఫున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సొసైటీ అధ్యక్షులు సిరికొండ తిరుపతిరావు తెలిపారు. ఈ జిల్లాలో పండుతున్న పంటలు, రైతుల అభిప్రాయాలను తెలుసుకునే విధంగా శనివారం నాబార్డ్ జీఎం తో సమావేశమయ్యారు. నాబార్డ్ అధికారులు సొసైటీ డైరెక్టర్లు రవీందర్ రెడ్డి, కిరణ్ ఉన్నారు.
Similar News
News February 8, 2025
పెద్దపల్లి: యూరియా అందుబాటులో ఉంది: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739014585722_14924127-normal-WIFI.webp)
పెద్దపల్లి జిల్లాలోయూరియా నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నాయని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. యాసంగిలో రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని 37,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని ప్రణాళిక తయారు చేసినట్టు తెలిపారు. జిల్లాలో యూరియా ఇబ్బంది లేదని ఆయన పేర్కొన్నారు. యూరియా కోసం మండల వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చన్నారు.
News February 8, 2025
అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739020785886_18976434-normal-WIFI.webp)
కాళేశ్వర శ్రీ ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం జరగనున్న మహా కుంభాభిషేకం చివరి రోజు మహోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
News February 8, 2025
ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి: మోదీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739020989555_1032-normal-WIFI.webp)
ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి లభించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ ప్రజలకు ఈ రోజు పండుగలాంటిదని విజయోత్సవ సభలో చెప్పారు. ‘ఢిల్లీని వికసిత్ రాజధానిగా మార్చే అవకాశం ఇచ్చారు. ఢిల్లీ ప్రజల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇక్కడి ప్రజలు మోదీ గ్యారంటీని విశ్వసించి డబుల్ ఇంజిన్ సర్కార్ తెచ్చుకున్నారు. BJPని మనసారా ఆశీర్వదించారు. మీ ప్రేమకు అనేక రెట్లు తిరిగి ఇస్తాం’ అని పీఎం ప్రసంగించారు.