News February 8, 2025
మేడారానికి బస్సు ప్రారంభం

మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు హనుమకొండ నుంచి తాడ్వాయి మీదుగా ప్రతి రోజు 6 ట్రిప్పులు బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క చొరవతో మహా జాతరకు బస్సు సౌకర్యం ఉన్నట్లు మినీ జాతరకు కూడా బస్సులు ఏర్పాట్లు చేశారు.
Similar News
News March 20, 2026
UPDATE: భద్రాచలం.. ఐదుగురు గల్లంతు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం

భద్రాచలం: గోదావరి నదిలో స్నానానికి దిగి అమరావతిలోని SRM కాలేజీ ఇంజినీరింగ్ విద్యార్థులు ఐదుగురు <<19432137>>గల్లంత<<>>య్యారు. మొత్తం ఏడుగురు యువకులు నదిలోకి దిగగా, ఉద్ధృతికి అందరూ కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు సురక్షితంగా బయటపడగా.. అభిరామ్(విజయనగరం), శ్రీకర్(భద్రాచలం), తేజ(ఉయ్యూరు), సతీష్(మదనపల్లి), నవదీప్(ఉయ్యూరు) ప్రవాహంలో గల్లంతయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, శ్రీకర్, నవదీప్ మృతదేహాలు లభ్యమయ్యాయి.
News March 20, 2026
సంగారెడ్డి: మంజీరా నదిలో వేలాది చేపల మృత్యువాత

హత్నూర మండలం పల్పనూర్ శివారులోని మంజీరా నదిలో వేలాది చేపలు మృతి చెంది పైకి తేలడం స్థానికంగా కలకలం రేపింది. కలుషిత జలాల వల్లే చేపలు చనిపోయాయని, దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం డిమాండ్ చేశారు.
News March 20, 2026
‘అర్జీలను సత్వరం పరిష్కరించాలి’: శ్రీకాకుళం కలెక్టర్

దివ్యాంగుల అర్జీల పరిష్కారంలో జాప్యం జరగరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ను కలెక్టర్ దివ్యాంగుల సంక్షేమశాఖ, ఏడీబీ శైలజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ గ్రీవెన్స్లో 7 దరఖాస్తులు స్వీకరించారు. వీటిని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


