News February 8, 2025
సిద్దిపేట: ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

సిద్దిపేట జిల్లా చేగుంట, గజ్వేల్ రహదారి పై నర్సపల్లి చౌరస్తా వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. మృతులు దౌల్తాబాద్ మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. రోడ్డు దాటుతున్న బైక్ను లారీ ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 17, 2026
పాలమూరు: రంజాన్ వేళ ఘుమఘుమలు..!

పవిత్ర రంజాన్ నెల వచ్చిందంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో హలీమ్.. నోరూరించే చికెన్ హరీస్ దర్శనమిస్తాయి. ముస్లింలతో పాటు ఇతర వర్గాల వారు కూడా ఇష్టంగా కొనుక్కుని తింటారు. ప్రధాన రహదారుల్లో, పెద్ద హోటళ్ల ముందు నిర్వాహకులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. పలుచోట్ల సాయంత్రం వేళల్లో భోజన ప్రియులు క్యూలు కట్టి మరీ తింటున్నారు. మీరు తిన్నారా? కామెంట్ చేయండి?
News March 17, 2026
PDPL: మసీదుల ఏరియాలను పరిశీలించిన రామగుండం CP

రంజాన్ పర్వదినం సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి పట్టణంలోని పలు మసీదులను సోమవారం రాత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. ముస్లిం సోదరులను కలిసి మాట్లాడారు. జగ్నేకీ రాత్ సందర్భంగా ముస్లిం సోదరులు నమాజ్ నిర్వహించుకునే విధంగా ప్రత్యేక భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. మసీదు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాలని పోలీసులకు సూచించారు.
News March 17, 2026
జగిత్యాల: బాధితులకు తక్షణ న్యాయం చేయాలి: ఎస్పీ

జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ అశోక్ కుమార్ అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా వచ్చిన 14 మంది బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు.


