News February 8, 2025
సిద్దిపేట: పంచాయతీ రాజ్ పనులన్నీ పూర్తి చేయాలి: కలెక్టర్

పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ పనులను మార్చి నెల చివరకల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం సమికృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్లో పంచాయతీ రాజ్ శాఖ చేపడుతున్న పనులపైన పంచాయతీ రాజ్, డీఆర్డీఓ శాఖల అధికారులతో సమీక్షా జిల్లా కలెక్టర్ నిర్వహించారు. జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖలో ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపడుతున్న పనులు పూర్తి చేయాలన్నారు.
Similar News
News March 19, 2026
నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ దంపతులు

అనకాపల్లి పట్టణం గవరపాలెం నూకాంబిక అమ్మవారి జాతర సందర్భాన్ని పురస్కరించుకుని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరితో పాటు జేసీ సౌర్యమాన్ పటేల్, ఆర్డీవో షేక్ ఆయిషా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు.
News March 19, 2026
CSKకు బిగ్ షాక్.. కీలక బౌలర్ దూరం

మరో 9 రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా CSK జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్(AUS) గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఈ విషయాన్ని CSK CEO విశ్వనాథన్ తాజాగా ఓ ఈవెంట్లో వెల్లడించారు. ఆయన స్థానంలో వేరే బౌలర్ కోసం చూస్తున్నామన్నారు. డెత్ ఓవర్లలో ఎల్లిస్ కీలక బౌలర్ అని, ఆయన దూరమవడం తమకు పెద్ద దెబ్బ అని విశ్వనాథన్ పేర్కొన్నారు.
News March 19, 2026
ఇరాన్ ఆ కేబుల్స్ కట్ చేస్తే ఇంటర్నెట్ బంద్!

పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇంటర్నెట్ కనెక్షన్లనూ దెబ్బతీసే ప్రమాదం ఉంది. హార్ముజ్, బాబ్-ఎల్-మాండెబ్ జలసంధుల కింద పెద్ద ఎత్తున డేటా కేబుల్స్ ఉన్నాయి. ఇవి యూరప్, ఆసియా, ఆఫ్రికా మధ్య ఇంటర్నెట్ ట్రాఫిక్ను లింక్ చేస్తున్నాయి. యుద్ధంలో భాగంగా ఇవి ధ్వంసమైతే మనకు ఇబ్బందులు తప్పవు. 2024లో హౌతీల దాడుల సమయంలో ఇదే జరిగింది. పైగా మిలిటరీ యాక్టివిటీ వల్ల వాటిని రిపేర్ చేయడానికి నెలల సమయం పట్టింది.


