News February 8, 2025

‘విష’ ప్రచారం వర్కౌట్ కాలేదు

image

ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక యమునా నది శుద్ధి ఎక్కడ అంటూ ప్రతిపక్షాలు AAP ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. తాను రివర్స్ కౌంటర్ ఇద్దామని భావించి హరియాణా ప్రభుత్వం యమునా నదిని విషంగా మార్చి సరఫరా చేస్తోందని కేజ్రీవాల్ ప్రచారం చేశారు. ఈ ఆరోపణలపై ఈసీ కూడా AKను వివరణ కోరింది. హరియాణా సీఎం సైనీ ఆ నీటిని తాగి చూపించిన వీడియోను రిలీజ్ చేయడంతో కేజ్రీ ‘విష’ ప్రచారం AAPకే బెడిసికొట్టింది.

Similar News

News January 6, 2026

నేటి నుంచే విద్యుత్ ‘ప్రజా బాట’

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల తక్షణ పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా బాట’ కార్యక్రమం జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 8 గంటల నుంచి మండలాల వారీగా ఈ శిబిరాలు నిర్వహిస్తామని ఎస్‌ఈ శ్రీనివాసాచారి తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బంది, జిల్లా అధికారులు అందుబాటులో ఉండి ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరిస్తారన్నారు.

News January 6, 2026

బిట్‌కాయిన్ స్కామ్.. శిల్పా శెట్టి భర్తకు కోర్టు నోటీసులు

image

బిట్‌కాయిన్ స్కామ్‌లో హీరోయిన్ శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో ED దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న PMLA ప్రత్యేక కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. బిట్‌కాయిన్ పోంజీ స్కామ్ సూత్రధారి అమిత్ భరద్వాజ్ నుంచి ఆయన 285 బిట్‌కాయిన్లు (రూ.150 కోట్లకు పైగా విలువ) తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జనవరి 19న హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

News January 6, 2026

చలిగా ఉందని వేడి నీటితో స్నానం చేస్తున్నారా?

image

చలికాలంలో వేడి నీళ్లతో స్నానం హాయిగా అనిపించినా లేనిపోని సమస్యలొస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొగలు కక్కే నీటితో స్నానం చేస్తే ‘చర్మంపై ఉండే సహజ నూనెలు తొలగిపోతాయి. ఆపై చర్మం పొడిగా మారి దురద, పగుళ్లు ఏర్పడతాయి. తలస్నానం చేస్తే జుట్టు పొడిబారి, బలహీనమై రాలిపోతుంది. శరీర ఉష్ణోగ్రతతో పాటు బీపీ పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి’ అని సూచిస్తున్నారు.