News February 8, 2025

బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలి: KMR కలెక్టర్

image

మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్ లో పీఓ, ఏపీఓ, ఓపీఓలకు మొదటి దఫా శిక్షణా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోసం కేటాయించిన సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు.

Similar News

News February 8, 2025

‘అఖండ-2’లో విలన్‌గా క్రేజీ యాక్టర్?

image

సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం సినిమాల్లో విభిన్న పాత్రలతో అలరించిన నటుడు ఆది పినిశెట్టి మరోసారి బోయపాటి శ్రీను మూవీలో విలన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. బోయపాటి తెరకెక్కిస్తోన్న ‘అఖండ-2’లో ప్రతినాయకుడి పాత్రలో ఆది కనిపిస్తారని సినీవర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. బోయపాటి తెరకెక్కించిన ‘సరైనోడు’ సినిమాలో ఆది విలనిజంకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

News February 8, 2025

ఎద్దు దాడిలో గాయపడ్డ వృద్ధుడు మృతి

image

నర్సీపట్నం మున్సిపాలిటీ బీసీ కాలనీలో బుధవారం జరిగిన ఎద్దు దాడిలో గాయపడ్డ గీశాల కన్నయ్య అనే వృద్ధుడు విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. ఎద్దు చేసిన దాడిలో కన్నయ్యకు కాలు, చెయ్యి విరిగిపోయాయి. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ తరలించాలని ఏరియా ఆసుపత్రి వైద్యులు రిఫర్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News February 8, 2025

పెద్దపల్లి: ఈనెల 10 నాటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

ఈనెల 10న పెద్దపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ప్రజలు దీనిని గమనించి సోమవారం కలెక్టరేట్‌కు రావొద్దని ఆయన సూచించారు.

error: Content is protected !!