News February 8, 2025
బెల్లంపల్లి రేంజ్లోనే పులి ఆవాసం!

గత 10రోజులుగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని అటవీ ప్రాంతం నుంచి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పరిధిలో పులి సంచరిస్తూ అడవి ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. అటవీ శాఖ అధికారి పూర్ణచందర్ ఆధ్వర్యంలో సిబ్బంది శనివారం ఉదయం కాసిపేట మండలం వరిపేట గ్రామ సరిహద్దుల్లో పులి పాదముద్రలు గుర్తించినట్లు తెలిపారు. అటవీ సమీప చేలల్లో పంటలు ఎలా కాపాడుకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News February 24, 2026
మొబైల్ యాప్తో పారదర్శకంగా యూరియా పంపిణీ: DAO

రైతులు ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడకుండా ప్రభుత్వం యూరియా మొబైల్ యాప్ విధానాన్ని ప్రవేశపెట్టిందని DAO స్వరూప రాణి తెలిపారు. మంగళవారం జిల్లాలో యూరియా పంపిణీ ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యాప్ ద్వారా రైతులు సులభంగా యూరియా పొందేందుకు వీలుంటుందని, ఈ కొత్త పద్ధతిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. పంపిణీలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
News February 24, 2026
NZB: కలెక్టర్, సీపీతో రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఛైర్మన్ భేటీ

రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఛైర్మన్ తారిక్ అన్సారీ కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలను భేటీ అయ్యారు. మైనార్టీ సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు చేయాలని, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మైనార్టీ విద్యాలయాల్లో పూర్తి స్థాయి అడ్మిషన్లు జరిగేలా చూడాలని, ప్రభుత్వ సదుపాయాలపై అవగాహన పెంచాలని పేర్కొన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి పాల్గొన్నారు.
News February 24, 2026
హన్మకొండలో 1,104 మంది టీబీ రోగులు

హన్మకొండ జిల్లాలో 1,104 మందికి టీబీ ఉన్నట్లుగా గుర్తించినట్లు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ హిమబిందు బుధవారం తెలిపారు. క్షయ వ్యాధి నిర్ధారణ కోసం జిల్లాలో వైద్య శిబిరాలు నిర్వహించమన్నారు. 60 ఏళ్లు పైబడిన వారు, హెచ్ఐవీ ఎయిడ్స్ ఉన్నవారు, డయాబెటిస్ రోగులు, టీబీ కాంటాక్ట్ ఉన్న 1,93,935 మందికి పరీక్షలు చేశామని, 73,711 మందికి ఎక్స్రేలు తీయగా 1,104 మంది టీబీ రోగులను గుర్తించినట్లు తెలిపారు.


