News February 8, 2025
కర్రివలసలో వ్యక్తి ఆత్మహత్య

పాచిపెంట మండలం కర్రివలస గ్రామంలో దాసరి శంకరరావు(35) ఆత్మహత్య చేసుకున్నారని ఏఎస్సై బి.ముసలినాయుడు తెలిపారు. శనివారం మాట్లాడుతూ.. భార్యభర్తల మధ్య గొడవల కారణంగా శంకరరావు శుక్రవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసి విజయనగరం మహారాజ ఆసుపత్రికి రిఫర్ చేశారని, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారన్నారు. భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News March 23, 2026
మీ BPని పెంచే ‘డేంజర్’ ఫుడ్స్ ఇవే!

హై BP గుండెపోటు, స్ట్రోక్కు దారితీస్తుంది. రోజూ తినే ప్రాసెస్డ్ మీట్, క్యాన్డ్ సూప్స్, వైట్ బ్రెడ్ వంటి వాటిలో సోడియం విపరీతంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి శరీరంలో నీటిని నిలిపి ఉంచి BPని పెంచుతాయి. అలాగే కెచప్, సోయా సాస్, ఫ్రోజెన్ పిజ్జాలు, కూల్ డ్రింక్స్లోని చక్కెర కూడా హాని చేస్తాయి. అందుకే ఉప్పు, చక్కెర తగ్గించి.. తాజా కూరగాయలు, తృణధాన్యాలు తీసుకుంటే BP కంట్రోల్లో ఉంటుంది.
News March 23, 2026
ఈ యుద్ధం ట్రంప్ కొనితెచ్చుకున్న సమస్య: మాజీ CIA

ఇరాన్ యుద్ధం ట్రంప్ కొనితెచ్చుకున్న సమస్య అని మాజీ CIA లియోన్ పనెట్టా విమర్శించారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తుందని తెలిసినా ట్రంప్ యంత్రాంగం ముందస్తు ప్రిపరేషన్ లేకుండా యుద్ధానికి దిగిందని మండిపడ్డారు. ఈ దాడుల వల్ల ఇరాన్ బలహీనపడకపోగా మరింత కఠినమైన నాయకత్వం చేతుల్లోకి వెళ్లిందని విశ్లేషించారు. USలో పెరుగుతున్న ఇంధన ధరలు, 59% ప్రజల వ్యతిరేకత ట్రంప్ను ఇరకాటంలో నెట్టాయన్నారు.
News March 23, 2026
యుద్ధం.. సామాన్యుడిపై భారం పడకుండా మోదీ ప్లాన్!

యుద్ధం కారణంగా ఎరువులు, ఇంధనం, నిత్యావసర వస్తువుల కొరత రాకుండా మోదీ అధికారులను అలర్ట్ చేశారు. ఖరీఫ్ కోసం ఎరువుల నిల్వలు పెంచాలని, విద్యుత్ కొరత రాకుండా బొగ్గు సరఫరాను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఫార్మా, కెమికల్ రంగాలకు కావాల్సిన ముడి పదార్థాల కోసం ఇతర దేశాల నుంచి ప్రత్యామ్నాయాలను వెతకాలని సూచించారు. మంత్రులు, కార్యదర్శులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు.


