News February 8, 2025
కర్రివలసలో వ్యక్తి ఆత్మహత్య

పాచిపెంట మండలం కర్రివలస గ్రామంలో దాసరి శంకరరావు(35) ఆత్మహత్య చేసుకున్నారని ఏఎస్సై బి.ముసలినాయుడు తెలిపారు. శనివారం మాట్లాడుతూ.. భార్యభర్తల మధ్య గొడవల కారణంగా శంకరరావు శుక్రవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసి విజయనగరం మహారాజ ఆసుపత్రికి రిఫర్ చేశారని, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారన్నారు. భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News January 15, 2026
సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబోరేటరీలో అప్రెంటిస్ పోస్టులు

ఢిల్లీలోని DRDOకు చెందిన సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబోరేటరీలో 33 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. BSc/BE/BTech/Diploma/ITI/BA/B.Com అర్హతగల అభ్యర్థులు NATS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.drdo.gov.in
News January 15, 2026
పువ్వుల సాగు- మంచి ధర రావాలంటే మొక్కలు ఎప్పుడు నాటాలి?

పువ్వుల సాగులో లాభాలు రావాలంటే పంట నాటే సమయం కీలకం. దీని కోసం మార్చి, ఏప్రిల్ నెలల్లో మొక్కలను నాటుకోవడం మేలని.. హార్టికల్చర్ నిపుణులు, పువ్వుల సాగులో మంచి దిగుబడి సాధిస్తున్న రైతులు చెబుతున్నారు. ఇలా నాటితే జూన్ నుంచి పువ్వుల కాపు మొదలవుతుందని, జులై నుంచి ప్రారంభమయ్యే పండుగల నాటికి మంచి దిగుబడి వస్తుందని చెబుతున్నారు. అప్పుడు డిమాండ్ను బట్టి విక్రయిస్తే మంచి లాభం పొందవచ్చంటున్నారు.
News January 15, 2026
OTD: టీమ్ ఇండియా ఘన విజయం

సరిగ్గా ఇదే తేదిన మూడేళ్ల క్రితం శ్రీలంకపై టీమ్ ఇండియా అద్భుతమైన విజయం నమోదు చేసింది. గిల్(116), కోహ్లీ(166*) సెంచరీల విధ్వంసం చేయగా భారత్ 50 ఓవర్లలో 390/5 స్కోరు చేసింది. ఛేదనలో సిరాజ్ 4, షమీ, కుల్దీప్ చెరో 2 వికెట్లతో చెలరేగడంతో SL 73 పరుగులకే కుప్పకూలింది. దీంతో 317 పరుగుల తేడాతో ఘనవిజయం సొంతమైంది. పరుగులు పరంగా ODIల్లో భారత్కు ఇదే భారీ విజయం. ఈ మ్యాచులో కోహ్లీ POTMగా నిలిచారు.


