News February 8, 2025
నల్గొండ పోలీసులకు తలనొప్పిగా పిల్లి కేసు!

పిల్లి పెట్టిన లొల్లి NLG పోలీసులకు తలనొప్పిగా మారింది. స్థానిక రహమత్ నగర్కు చెందిన పుష్పలత పెంచుకుంటున్న పిల్లి ఏడాదిక్రితం తప్పిపోగా PSలో ఫిర్యాదు చేశారు. పక్కింట్లో అదే పోలికలతో ఉన్న పిల్లి కనిపించగా ఆపిల్లి తమదేనని, పక్కింటి వారు ఎత్తుకెళ్లారంటూ Jan15న 2టౌన్ PSలో పుష్పలత కేసు పెట్టింది. పోలీసులు పిల్లి వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిచారు. పిల్లి ఎవరికి చెందుతుందో తేలాల్సి ఉంది.
Similar News
News March 13, 2026
మంచిర్యాల: ఎస్సీ యువతకు GOOD NEWS

జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, ఆర్థిక పురోగతి పెంపొందించాలే లక్ష్యంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పలు పథకాలు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. అర్హులైన ఎస్సీ నిరుద్యోగ యువత ఈ నెల 17 నుంచి 24లోపు https:tgobmms.cgg.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News March 13, 2026
దేవగిరి నగరం రాక్షస గుహలను పరిశీలించిన ఎస్పీ

పినపాక మండలంలోని పాండురంగాపురం పంచాయతీ పరిధిలో గల దేవగిరి నగరం రాక్షస గుహలను ఎస్పీ రోహిత్ రాజ్ సందర్శించారు. శుక్రవారం ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన, గుహల విశిష్టతను, అక్కడి భౌగోళిక పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యాటకుల భద్రత, అక్కడ తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భద్రతా పరమైన అంశాలపై చర్చించారు.
News March 13, 2026
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

ప్రముఖులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు ఎస్పీ విక్రాంత్ విక్రాంత్ హెచ్చరించారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వేదికల్లో తప్పుడు వార్తలు, ద్వేషపూరిత పోస్టులు చేస్తే గుర్తించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని ప్రజలకు సూచించారు.


