News February 8, 2025

కూకట్‌పల్లిలో తూ.గో జిల్లా వివాహిత SUICIDE

image

ఆర్థిక ఇబ్బందులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్ పల్లి పీఎస్ పరిధిలోని సుమిత్రానగర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై దీక్షిత తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బీశెట్టి కనక రత్నమ్మ (46) ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త సత్తిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Similar News

News March 19, 2026

సంగారెడ్డి: ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

image

తెలంగాణ ప్రజలందరికీ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీపరాభవ నామ తెలుగు సంవత్సరం ప్రతి కుటుంబానికి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం అనుకూలించి సమృద్ధిగా వానలు కురిసి, పాడి పంటలు బాగా పండుతూ రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆయన ఆకాక్షించారు.

News March 19, 2026

పాలమూరు నేలకు కేంద్రం జలసంజీవని..!

image

నిరంతరం కరువు పరిస్థితులు ఎదుర్కొనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎంపిక చేసిన మండలాల్లో నీటి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. వాన నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మొత్తం రూ.100 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయగా, తొలి విడతగా రూ.50 కోట్లు విడుదలయ్యాయి. రైతు భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావడమే ఈ పథకం ఉద్దేశం .

News March 19, 2026

శ్రీశైలం: ఒక్క రోజే లక్ష మందికి పైగా భక్తులు

image

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మరో కర్ణాటక, మహారాష్ట్రను తలపిస్తోంది. ఉగాది మహోత్సవాల సందర్భంగా క్షేత్ర పరిధిలో చూసినe కన్నడ భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. తమ పుట్టింటి ఆడపడుచుకు సారే సమర్పించేందుకు కన్నడిగులు శ్రీశైలం తరలివచ్చారు. తొలి తెలుగు సంవత్సరం ప్రారంభం ఉగాది పర్వదినాన స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే 1,03,655 మంది భక్తులు దర్శించుకున్నారు.