News February 8, 2025
అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్
కాళేశ్వర శ్రీ ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం జరగనున్న మహా కుంభాభిషేకం చివరి రోజు మహోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
Similar News
News February 9, 2025
SA20 టోర్నీ విజేతగా MI కేప్టౌన్
SA20-2025 టైటిల్ను MI కేప్టౌన్ గెలుచుకుంది. సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్తో జరిగిన ఫైనల్లో 76 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత MI 181-8 స్కోర్ చేయగా, ఛేదనలో తడబడిన సన్రైజర్స్ 105 పరుగులకే పరిమితమైంది. ఈ టోర్నీ చరిత్రలో MIకి ఇదే తొలి టైటిల్. కాగా తొలి రెండు సీజన్లలో సన్ రైజర్స్ ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే.
News February 9, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 9, 2025
CCL: తెలుగు వారియర్స్ ఓటమి
సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో కర్ణాటక బుల్డోజర్స్తో మ్యాచులో తెలుగు వారియర్స్ 46 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 113/3 స్కోర్ చేయగా, తెలుగు టీమ్ 99/5 చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో బుల్డోజర్స్ 123/3 స్కోర్ సాధించగా, వారియర్స్ 91/9కే పరిమితమై పరాజయం పాలైంది. KA జట్టులో డార్లింగ్ కృష్ణ 38 బంతుల్లోనే 80 రన్స్ చేసి రాణించారు.