News February 8, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై పీఓ, ఎపీఓలకు శిక్షణ

image

ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ఫిబ్రవరి 27న నిర్వహించబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పీఓ, ఎపీఓలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరిటెండెంట్ శ్రీనివాసరాజు, డీటీ వేణు, ఎలక్షన్ ట్రైనర్స్ రమేష్, వెంకటేశ్వర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News December 30, 2025

కొత్త సంవత్సరం ‘గ్రీటింగ్ స్కామ్స్’.. బీ అలర్ట్!

image

న్యూ ఇయర్ సందర్భంగా ‘గ్రీటింగ్ స్కామ్స్’ పట్ల తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రజలను అప్రమత్తం చేసింది. వాట్సాప్, టెలిగ్రామ్, SMS ద్వారా వచ్చే పర్సనలైజ్డ్ గ్రీటింగ్స్, న్యూ ఇయర్ గిఫ్ట్స్ లేదా బ్యాంకు రివార్డుల వంటి లింకులను క్లిక్ చేయొద్దని సూచించింది. లేదంటే ‘Malicious APK’ ఫైల్స్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యి బ్యాంక్ ఖాతా వివరాలు, OTPలు, వ్యక్తిగత ఫొటోలను దొంగిలించొచ్చని హెచ్చరించింది.

News December 30, 2025

NHIDCLలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు..

image

నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(<>NHIDCL<<>>)లో 6 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సివిల్స్ మెయిన్స్ 2024 క్వాలిఫై, ఇంటర్వ్యూకు హాజరైనవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 34 ఏళ్లు. సివిల్స్ మెయిన్స్‌లో సాధించిన మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com/

News December 30, 2025

KMR: ‘ఎగిరే గాలిపటం.. తీయొద్దు ప్రాణం’

image

సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగురవేసే ఉత్సాహం ఇతరుల ప్రాణాల మీదకు రాకూడదని KMR ఎస్పీ రాజేష్ చంద్ర ప్రజలను కోరారు. గత సంక్రాంతి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో 65 బెండల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. చైనా మాంజా విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.