News February 8, 2025

విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న MHBD కలెక్టర్

image

గూడూరులో కేజీబీవీ ఆశ్రమ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తనిఖీ చేశారు. వసతి గృహంలో ఉన్న పరిసరాలను పరిశీలించి, విద్యార్థులకు వండిన వంటలను పరిలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన వివరాలను సంబధిత వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లాస్ రూమ్‌లలోకి వెళ్లి విద్యార్థులను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమకు విద్యార్దులు తమకు తెలపాలన్నారు.

Similar News

News November 14, 2025

అమలాపురం: నాచు తయారీపై పైలెట్ ప్రాజెక్టు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్.యానం, పల్లం గ్రామాల్లో సముద్రపు నాచు తయారీ పైలట్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ ప్రకటించారు. తన =కార్యాలయంలో సంబంధిత అధికారులతో శుక్రవారం చర్చించారు. సముద్రపు నాచు తయారీకి 16 మంది డ్వాక్రా మహిళలు, ఆర్నమెంట్ చేపల పెంపకానికి 21మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ వెల్లడించారు.

News November 14, 2025

స్థానిక ఎన్నికలపై 17న నిర్ణయం: CM రేవంత్

image

TG: ఈ నెల 17న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించి, స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. క్యాబినెట్ భేటీలో మంత్రులందరితో ఈ అంశంపై చర్చిస్తామని వెల్లడించారు. కాగా జూబ్లీహిల్స్ గెలుపుతో స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సీఎం వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఈ నెల 17న లోకల్ బాడీ ఎన్నికలపై క్లారిటీ రానుంది.

News November 14, 2025

GWL: బాలలు స్వేచ్ఛా వాతావరణంలో పెరగాలి- సునంద

image

బాలలు స్వేచ్ఛా వాతావరణంలో పెరగాలని గద్వాల జిల్లా సంక్షేమ శాఖ అధికారి సునంద పేర్కొన్నారు. బాలల దినాన్ని పురస్కరించుకొని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బాలభవన్‌లో నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవాల్లో పాల్గొన్నారు. పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలని, వారిపై ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. అమ్మాయిలు స్వీయ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలన్నారు.