News February 9, 2025

పార్వతీపురం: జిల్లాలో 1,96,612 మంది చిన్నారులకు డి వార్మింగ్ కార్యక్రమం

image

పార్వతీపురం మన్యం జిల్లాలో 1,96,612 మంది చిన్నారులకు డి వార్మింగ్ కార్యక్రమం ఈనెల 10న చేపడుతున్నట్లు DM&HO డాక్టర్ భాస్కరరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3845 అంగన్వాడీ కేంద్రాల్లో ఒకటి నుంచి ఐదేళ్లలోపు పిల్లలు 55,234 మంది, 5 నుంచి 19 ఏళ్ల వయస్సు గల 1,41,378 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది ప్రతి ఒక్కరికి మాత్రలు అందేలా చర్య చేపట్టాలని సూచించారు.

Similar News

News February 9, 2025

కడెం: పురుగు మందు తాగి వ్యక్తి మృతి

image

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి మనస్థాపం చెంది పురుగు మందు తాగి మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది.ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ..లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన కొత్తూరు శంకర్(43) భూముల పంపకాల విషయంలో గొడవ జరుగగా మనస్థాపం చెందాడు. దీంతో ఈనెల 7న పురుగుల మందు సేవించాడు.ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

News February 9, 2025

ముధోల్: ఇంటి నిర్మాణాల తవ్వకాల్లో పురాతన నాణేలు 

image

ముధోల్ మహాలక్ష్మిగల్లీకి చెందిన లూటే మారుతి పటేల్ ఇంటిని నిర్మాణ పనులను శుక్రవారం చేపట్టారు. పిల్లర్ కోసం తవ్వుతుండగా మట్టి కుండలో 92 అతి పురాతన నాణేలు లభ్యమయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సంజీవ్, తహశీల్దార్ శ్రీకాంత్ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని చేరుకొని తవ్వకాల్లో బయటపడ్డ నాణేలను పరిశీలించారు. నాణేలను జిల్లా ఖజానా కార్యాలయంలో జమ చేస్తున్నట్లు తహశీల్దార్ పేర్కొన్నారు.

News February 9, 2025

సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ.. ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్ బూతుల ఏర్పాటు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!