News February 9, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం
* బీజేపీకి 48, ఆప్‌నకు 22, కాంగ్రెస్‌కు 0 సీట్లు
* ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి: మోదీ
* AP: 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా: సీఎం చంద్రబాబు
* విడదల రజినీని దోషిగా నిలబెడతా: ప్రత్తిపాటి
* TG: కవిత వల్లే ఢిల్లీలో ఆప్ ఓటమి: మంత్రి కొండా సురేఖ
* రాష్ట్రంలో రియల్ ఎస్టేట్‌ నాశనం: కేటీఆర్

Similar News

News March 11, 2026

ఇండియాకు వస్తున్న షిప్‌పై ఇరాన్ దాడి!

image

గుజరాత్‌కు వస్తున్న థాయి‌లాండ్‌ కార్గో షిప్‌ ‘మయూరీ నారీ’పై ఇరాన్ దాడికి దిగింది. UAEలోని ఖలీఫా పోర్టు నుంచి బయల్దేరిన కాసేపటికే హార్ముజ్ జలసంధి వద్ద అటాక్ చేసింది. ఇది తమ పనేనని తాజాగా ధ్రువీకరించింది. అందులోని 20 మంది సిబ్బందిని కాపాడగా, ముగ్గురు మిస్ అయ్యారు. ప్రేషియస్ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఈ నౌక కండ్లా పోర్టు(గుజరాత్)కు వస్తోంది.

News March 11, 2026

గ్యాస్ బుక్ చేస్తున్నారా?

image

TG: గ్యాస్‌ సిలిండర్ల కొరతను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. అందుకు నకిలీ LPG బుకింగ్ సైట్లను క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. త్వరగా సిలిండర్ సప్లై చేస్తామంటే నమ్మొద్దని, అది మోసమని గ్రహించాలని చెప్పారు. సిలిండర్ బుకింగ్ పేరిట అపరిచిత వ్యక్తులకు OTPలు చెప్పొద్దని సూచించారు. ఈ తరహా మోసాలకు గురైతే 1930కి వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు.

News March 11, 2026

గూగుల్, అమెజాన్‌లపై ఇరాన్ గురి

image

US ఎంబసీలు, సైనిక స్థావరాలపైన దాడి చేస్తున్న ఇరాన్ ఇప్పుడు టెక్ కంపెనీలపైన ఫోకస్ పెట్టింది. USకు చెందిన క్లౌడ్, డేటా అండ్ డెవలప్మెంట్ సెంటర్లు ఇరాన్ కొత్త టార్గెట్ల జాబితాలో చేరాయని ఆ దేశ మీడియా తస్నిమ్ న్యూస్ తెలిపింది. దీంతో గల్ఫ్ సహా ఇజ్రాయెల్‌లోని అమెరికన్ టెక్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఐబీఎమ్, ఒరాకిల్, పాలంటీర్ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.