News February 9, 2025

భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి: ASF కలెక్టర్

image

భూ భారతి దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తహశీల్దార్‌ను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం 3గంటలకు రెబ్బెన మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు.  పత్రాల కోసం వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా జారీ చేయాలని ఆదేశించారు.

Similar News

News March 25, 2026

పొదుపులో మహిళలు మహారాణులే.. కానీ!

image

డబ్బు దాచడంలో భారత మహిళలు ముందున్నా పెట్టుబడుల విషయంలో మాత్రం వెనకబడే ఉన్నారు. తాజా నివేదిక ప్రకారం 70%మంది మహిళలు పొదుపు చేస్తున్నారు. అయితే ఇందులో 40%మంది మాత్రమే FD, బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడులపై కాకుండా షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవగాహన లేకపోవడం, నష్టభయం వల్ల చాలామంది వీటికే పరిమితమవుతున్నారు. ఎక్కువ మంది తమ ఆదాయంలో 10% కంటే తక్కువ పెట్టుబడి పెడుతున్నారట.

News March 25, 2026

నరసాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీ

image

నరసాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ జి.శివయ్య బుధవారం సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. వార్షిక ఆదాయం, రిజిస్ట్రేషన్ల విధానంపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, భీమవరం పరిధిలోని 15 కార్యాలయాల ద్వారా ఈ నెల 23 నాటికి రూ.425.17 కోట్ల రెవెన్యూ వచ్చినట్లు వెల్లడించారు. అనంతరం విధుల్లో పారదర్శకత పాటించాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు.

News March 25, 2026

GNT: రేపు పోలీస్ కండెమినేషన్ వస్తువుల బహిరంగ వేలం

image

గుంటూరు (D) పోలీస్ శాఖకు చెందిన పాత వస్తువుల బహిరంగ వేలం మార్చి 26న నిర్వహించనున్నారు. SP వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం 4 గ. RI స్టోర్‌లో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో పాత టెంట్లు, కుర్చీలు, సమియానాలు, ప్లాస్టిక్ డ్రమ్ములు, ఫ్యాన్లు, టార్చ్‌లైట్లు, వివిధ రకాల వస్తువులను వేలం వేయనున్నారు. ఆసక్తి గల వారు ఈ వేలంలో పాల్గొని వస్తువులను కొనుగోలు చేయవచ్చని చెప్పారు.