News February 9, 2025
హైదరాబాద్ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం జరిగింది. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జికి సంబంధించి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. 90 రోజుల్లో బ్రిడ్జి డీపీఆర్ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి పరిసరాలను రూపొందించాలని సీఎం అన్నారు. రోడ్ల వెడల్పుపైనా పలు సూచనలు చేశారు.
Similar News
News March 8, 2026
సిటీ స్కైలైన్’ పిక్నిక్: ఫ్లైఓవర్ల కింద ఫాస్ట్ ఫుడ్!

నగరంలోని కొత్త ఫ్లైఓవర్ల కింద ఇప్పుడు వింతైన ‘డిన్నర్’ పార్టీలు జరుగుతున్నాయి. ఖరీదైన హోటళ్లకు వెళ్లే బదులు, బయోడైవర్సిటీ, షేక్పేట్ ఫ్లైఓవర్ల కింద బైకులు ఆపి, రోడ్డు పక్కన దొరికే బండి మీద తిండి తింటూ గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. ట్రాఫిక్ వెలుగుల మధ్య, వాహనాల హడావుడిని చూస్తూ గడపడమే ఒక ‘అర్బన్ అడ్వెంచర్’ అని వీరు భావిస్తున్నారు. ఈ ‘స్ట్రీట్ సైడ్’ లైఫ్ స్టైల్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
News March 8, 2026
ఈ వారం భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ వారం(మార్చి 2-8) బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.6,870, తగ్గి రూ.1,63,640గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.6,300 పడిపోయి రూ.1,50,000 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ ధర రూ.25వేలు తగ్గి రూ.2,90,000లకు చేరింది. మిడిల్ ఈస్ట్లో యుద్ధం వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతాయని భావించినా అనూహ్యంగా తగ్గడం గమనార్హం.
News March 8, 2026
కడప జిల్లాలో విద్యుత్ బకాయిలు రూ.26.46 కోట్లు

కడప జిల్లాలో ప్రవేట్ విద్యుత్ సర్వీసుల నుంచి ఇప్పటి వరకు రూ.26.46 కోట్లు బకాయిలు ఉన్నాయి. డివిజన్ల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.
కడపలో రూ.8.99 కోట్లు, ప్రొద్దుటూరులో రూ.10.61 కోట్లు, మైదుకూరులో రూ.7.10 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇక పులివెందుల డివిజన్ పరిధిలో మాత్రం కొన్ని ప్రవేట్ కంపెనీలు అడ్వాన్స్ చెల్లింపులు చేయడంతో ఇక్కడ రూ.24.85 లక్షలు మిగులు ఉన్నాయి.


