News February 9, 2025

అరుణాచలం గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్: డిపో మేనేజర్‌ 

image

తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక సూపర్‌ లగ్జరీ బస్‌ నడుపుతున్నట్లు RTC WGL-1 డిపో మేనేజర్‌ వంగల మోహన్‌ రావు తెలిపారు. ఈనెల 10న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ జిల్లా బస్‌ స్టేషన్‌ నుంచి బయలు దేరుతుందని తెలిపారు. చార్జీలు పెద్దలకు రూ.4500, పిల్లలకు రూ.3వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. వివరాలకు 9959226047, 9494107944 నెంబర్‌లో సంప్రదించాన్నారు.

Similar News

News February 9, 2025

నేడు కాళేశ్వరంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం

image

కాళేశ్వరంలో మహా కుంభాభిషేకం ఉత్సవాల్లో భాగంగా అత్యంత ముఖ్యమైన ఘట్టం ఆదివారం జరగనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఆదివారం 10:42 గంటలకు మహా కుంభాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం తుని తపోవన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి నేతృత్వంలో నిర్వహిస్తారు. ఆదివారం సాయంత్రం ముగింపు కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

News February 9, 2025

VZM: ‘అనుమతులు లేకుండా పశు మాంసం విక్రయించొద్దు’

image

విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో పశు మాంసం అమ్మే వ్యాపారులతో 1వ పట్టణ పోలీసులు శనివారం సమావేశం నిర్వహించారు. ట్రేడ్ లైసెన్సు‌తో పాటు అన్ని అనుమతులు ఉన్నవారు మాత్రమే పశు మాంసాన్ని విక్రయించాలని, అనుమతులు లేకుండా పశువులను వధించడం, రవాణా చేయడం చట్ట ప్రకారం నేరమన్నారు. చట్ట వ్యతిరేకంగా పశువుల వధించడం, రవాణా చేసినట్లయితే వారిపై కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరించారు.

News February 9, 2025

తూ.గో: 26 మంది ఉద్యోగులకు షాకోజ్ నోటీసులు

image

విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న 26 మంది ఉద్యోగులకు శనివారం కలెక్టర్ షాకోజ్ నోటీసులు జారీ చేశారు. వారిలో 12 మంది డిప్యూటీ తహశీల్దార్లు , 12 మంది మండల సర్వేయర్లు, ఇద్దరు గ్రామ సర్వేయర్లు ఉన్నారు. రాజమండ్రి రూరల్, పెరవలి, గోపాలపురం, చాగల్లు, గోకవరం, కడియం, దేవరపల్లి, నల్లజర్ల, బిక్కవోలు, కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాల డిప్యూటీ తహశీల్దార్లు ఉన్నారు.

error: Content is protected !!