News February 9, 2025

ములుగు: గుప్పుమంటున్న గుడుంబా

image

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో గుడుంబా గుప్పుమంటుంది. పలు గ్రామాల్లో రహస్యంగా గుడుంబా విక్రయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా పలు ప్రాంతాల్లో గుడుంబా విక్రయ, తయారీదారులపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ గుడుంబా మహమ్మారి అడ్డుకట్ట పడడం లేదన్నారు. బుట్టాయిగూడెంలోని ఓ ప్రాంతంలో గుడుంబా తాగి స్పృహ కోల్పోయి కాల్వలో పడిన ఓ వ్యక్తి ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Similar News

News March 14, 2026

తిరుపతి: ‘సార్.. నా భార్య SIతో వెళ్లిపోయింది’

image

ఓ SI ప్రేమ పేరుతో తన భార్యను తీసుకెళ్లాడని తిరుపతి జిల్లా వాకాడు మండల వాసి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ‘ఓ కేసు విషయమై నేను, నా భార్య స్టేషన్‌కు వెళ్లాం. ఆ సమయంలో ఎస్ఐకు నా భార్య(36)తో పరిచయం ఏర్పడింది. నేను లేని సమయంలో ఎస్ఐ మా ఇంటికి వస్తున్నాడు. దీనిపై 4రోజుల క్రితం నా భార్యను నిలదీయగా తాళి నాకు ఇచ్చి ఎస్ఐతో వెళ్లిపోయింది’ అంటూ పోలీస్ ఉన్నతాధికారులకు అతను ఫిర్యాదు చేయడంతో విచారణ చేస్తున్నారు.

News March 14, 2026

ఎస్సీ నిరుద్యోగులకు సబ్సిడీ పథకాలు: భద్రాద్రి కలెక్టర్

image

భద్రాద్రి జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగులు ఈవీ 2, 3 వీలర్ వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోలర్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. మొత్తం 276 యూనిట్లకు రూ.265.28 లక్షల సబ్సిడీతో ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. రూ.1 లక్ష వరకు 90%, రూ.2 లక్షలకు 80%, రూ.2 నుంచి 4 లక్షల వరకు 70%, రూ.4 లక్షలపైగా 60% సబ్సిడీతో బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తారని వెల్లడించారు.

News March 14, 2026

గ్యాస్ అక్రమాలపై కఠిన చర్యలు: DSO చందన్ కుమార్

image

ఖమ్మం జిల్లాలో గృహావసరాల గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని DSO చందన్ కుమార్ హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా నిల్వ ఉంచడం సహించబోమన్నారు. జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని వినియోగదారులు ఆందోళన చెందవద్దన్నారు. నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన వారికి సక్రమంగా సిలిండర్లు పంపిణీ చేయాలని డీలర్లకు ఆదేశించారు.