News February 9, 2025

నిర్మల్: గురుకుల విద్యార్థినిని అభినందించిన ప్రధాని

image

సోఫీ నగర్ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని ఎస్ వర్షితకు అరుదైన గౌరవం దక్కింది. 2024 సెప్టెంబర్ మాసంలో జాతీయస్థాయిలో నిర్వహించిన ప్రయోగాత్మక నైపుణ్య అభివృద్ధి భారత నిర్మాణంలో 5 మౌలిక సూత్రాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని ప్రజెంటేషన్ ఇచ్చినందుకుగాను ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురుకుల విద్యార్థి హర్షితకు హర్షితకు లేఖ పంపారు.

Similar News

News November 8, 2025

దుగ్గిరాల: అప్పు ఇప్పించలేదని అంతమొందించారు..!

image

అప్పు ఇప్పించలేదన్న కోపంతో దుగ్గిరాల యాదవపాలెంలో నీలాపు వీరబాబు (37)ను దారుణంగా హత్య చేశారు. చికెన్ వ్యాపారి నవీన్, వీరబాబు మధ్య డబ్బు విషయమై గొడవ జరిగింది. మనసులో పెట్టుకున్న నవీన్, బంధువు కృష్ణతో కలిసి శుక్రవారం సాయంత్రం వీరబాబు తల్లి కళ్లముందే కత్తితో గొంతు కోయించాడు. ఈ ఘటనపై ఎస్ఐ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 8, 2025

విశాఖపై దక్షిణాఫ్రికా క్రికెట్ కామెంటేటర్ భావోద్వేగ ట్వీట్

image

దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత కాస్ నాయుడు (Kass Naidoo) విశాఖతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. #CWC25 సందర్భంగా విశాఖ వచ్చిన ఆమె భావోద్వేగంగా స్పందించారు. తన తాత అనకాపల్లిలో పుట్టారని.. 57 ఏళ్ల క్రితం తన అమ్మ కూడా విశాఖలోనే ఉండేవారని గుర్తు చేసుకున్నారు. భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను క్రీడా రంగంలోని ఉత్తములతో కలిసి వ్యాఖ్యానం చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ ట్వీట్ చేశారు.

News November 8, 2025

దేశంలోనే మొదటి పురోహితురాలు

image

సాధారణంగా పెళ్లిళ్లు, అన్నప్రాశనలు, పూజలు వంటివన్నీ పురుషులే చేస్తుంటారు. కానీ కలకత్తాకి చెందిన నందిని భౌమిక్ పదేళ్లుగా పురోహితురాలిగా వ్యవహరిస్తోంది. నందిని రెండో కూతురి వివాహానికి పురోహితుడు ఎవరూ దొరక్కపోవడంతో ఆమే పురోహితురాలిగా మారారు. ఈ నిర్ణయాన్ని పురుషుల కంటే మహిళలే ఎక్కువగా వ్యతిరేకించారంటున్నారు నందిని. ఎప్పటికైనా ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలనేదే తన ఉద్దేశం అని చెబుతున్నారామె.