News February 9, 2025

ముధోల్: ఇంటి నిర్మాణాల తవ్వకాల్లో పురాతన నాణేలు 

image

ముధోల్ మహాలక్ష్మిగల్లీకి చెందిన లూటే మారుతి పటేల్ ఇంటిని నిర్మాణ పనులను శుక్రవారం చేపట్టారు. పిల్లర్ కోసం తవ్వుతుండగా మట్టి కుండలో 92 అతి పురాతన నాణేలు లభ్యమయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సంజీవ్, తహశీల్దార్ శ్రీకాంత్ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని చేరుకొని తవ్వకాల్లో బయటపడ్డ నాణేలను పరిశీలించారు. నాణేలను జిల్లా ఖజానా కార్యాలయంలో జమ చేస్తున్నట్లు తహశీల్దార్ పేర్కొన్నారు.

Similar News

News March 16, 2026

MBNR: పీయూలో KHO-KHO సెలక్షన్స్

image

సౌత్ జోన్‌లో పాల్గొనేందుకు పాలమూరు యూనివర్సిటీ KHO-KHO స్త్రీల విభాగంలో ఎంపికలను సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జిఎన్.శ్రీనివాస్, రిజిస్టర్ ప్రొఫెసర్ పూస రమేష్ బాబు హాజరై మాట్లాడారు. మంచి ప్రదర్శన కనబరిచి యూనివర్సిటీకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. పీడీ డా.వై.శ్రీనివాసులు, ఖో-ఖో ప్రొఫెసర్ సత్య భాస్కర్ రెడ్డి, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

News March 16, 2026

కడప: ఓపెన్ 10th పరీక్షలకు 388 విద్యార్థులు డుమ్మా.!

image

కడప జిల్లాలో సోమవారం 31 సెంటర్లలో ఓపెన్ 10th పరీక్షలను నిర్వహించారు. నేటి పరీక్షలకు 389 మంది విద్యార్థులు డుమ్మా కొట్టారు. 2261 మంది విద్యార్థులు తెలుగు పరీక్ష రాయాల్సి ఉండగా.. 1875 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉర్దూ పరీక్షకు 63 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 61 మంది పరీక్షలు రాశారు. జిల్లాలో రెగ్యులర్ 10th పరీక్షలు 167 సెంటర్లలో జరిగాయి. 27,838(100%) మంది విద్యార్థులు హాజరయ్యారు.

News March 16, 2026

పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన SP

image

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సోమవారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. ఆయన త్యాగం ఫలితంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరించిందన్నారు.