News February 9, 2025
కప్పట్రాళ్ల సమీపంలో ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి దుర్మరణం

దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామ సమీపంలో శనివారం ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. గోనెగండ్ల మండలం బోదెపాడుకు చెందిన బోయ హనుమంతు, రంగమ్మ దంపతుల కుమారుడు జగదీశ్(25) ఉల్లిగడ్డ లోడుతో వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదంలో జగదీశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి కుమారుడు ఉండగా.. భార్య 5 నెలల గర్భవతి. ఈ ఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 18, 2026
ఈనెల 21న రగ్బీ మహిళల ఛాంపియన్షిప్ పోటీలు

ఈనెల 21, 22వ తేదీల్లో కర్నూలు శివారులోని రిడ్జ్ పాఠశాల క్రీడా మైదానంలో ఏపీ స్టేట్ అస్మిత రగ్బీ మహిళల ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రగ్బీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.రామాంజనేయులు బుధవారం వెల్లడించారు. అండర్-15 సబ్ జూనియర్ విభాగంలో బాలికలకు, సీనియర్ విభాగంలో మహిళలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు కప్పు, మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు.
News March 18, 2026
ఓటర్ల మ్యాపింగ్లో పొరపాట్లకు తావివ్వకండి: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల మ్యాపింగ్లో పొరపాట్లకు తావివ్వకుండా చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి డీపీవో భాస్కర్ను టెలి కాన్ఫరెన్స్లో ఆదేశించారు. బుధవారం ఓటర్ల మ్యాపింగ్, తాగునీటి సమస్య, శానిటేషన్ అంశాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. 484 గ్రామ పంచాయతీలలో ఓటర్లను మ్యాప్ చేసేటప్పుడు కరెక్ట్గా చేశారా, లేదా అనేది చూసుకోవాలని పేర్కొన్నారు.
News March 18, 2026
దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: కలెక్టర్

దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కర్నూలు బస్టాండ్లో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మతో కలిసి ఆమె ప్రారంభించారు. దివ్యాంగులతో కలిసి కలెక్టర్ బస్సు ప్రయాణం చేశారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పెద్ద ఎత్తున సంక్షేమానికి సీఎం చంద్రబాబు 70 ఏళ్ల వయసులోనూ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.


